భీంపూర్, డిసెంబర్ 23 : భీంపూర్ మండలం బేల్సరీరాంపూర్ గ్రామంలో ఈ నెల 20 నుంచి 22వ తేదీ రాత్రి వరకు బజరంగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో జిల్లా, మహారాష్ట్ర నుంచి మొత్తం 117 జట్లు పాల్గొన్నాయి.
మొదటి బహుమతి రూ.31 వేలు మహారాష్ట్ర మాహోర్ జట్టు (దాత డీసీసీబీ చైర్మన్), రెండో బహుమతి రూ.21 వేలు మహారాష్ట్ర కిన్వట్ తాలూకా పాలొది (దాత చాకటి దశరథ్ ), మూడవ బహుమతి రూ.17 వేలు మహారాష్ట్ర సార్ఖని, నాలుగో బహుమతి రూ.15 వేలు మహారాష్ట్ర బ్రాహ్మణ్గూడ, ఐదో బహుమతి రూ. 5 వేలు భీంపూర్ మండలం చింతపల్లి , ఆరో బహుమతి రూ.5 వేలు భీంపూర్ మండలం బేల్సరీరాంపూర్, ఏడో బహుమతి రూ.5 వేలు బజార్హత్నూర్ మండలం రాయల్కొరి , ఎనిమిదో బహుమతి రూ.5 వేలు తలమడుగు మండలం లాల్గుడ జట్లు దక్కించుకున్నాయి. శుక్రవారం బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, ఎంపీపీ కుడిమెత రత్నప్రభ , వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, సర్పంచ్లు కుడిమెత రూప, మడావి లింబాజీ , పెండెపు కృష్ణయాదవ్, యువజన సంఘం ప్రతినిధులు మడావి అరవింద్, కుడిమెత సంతోష్ ,శంకర్, ప్రకాశ్, జగన్నాథ్, కృష్ణ పాల్గొన్నారు.