సోన్, నవంబర్ 1: మహారాష్ర్టాలోని యావత్మాల్ జిల్లాకు చెందిన వైద్యురాలు బర్నోట సురేఖ (46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఎస్ఐ సంతోషం రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. యావత్మాల్కు చెందిన వైద్యురాలు సురేఖ, భర్త ఫియుష్తో కలిసి కారులో కు టుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లింది. మంగళవారం తిరిగి యా వత్మాల్కు బయలుదేరారు.
సాయంత్రం మండలంలోని గంజాల్ గ్రా మం వద్ద జాతీయ రహదారిపై ఆమె వెళ్తున్న కారు ముందు టైరు ఒక్కసారిగా పగిలి రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకు బలంగా ఢీకొట్టడంతో ముందు సీట్లో కూర్చున్న వైద్యురాలి సురేఖ తలకు తీవ్రగాయలు కాగా.. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కారు నడుపుతున్న భర్త ఫీయూష్కు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన ప్రయాణికులు వెంటనే పో లీసులకు సమాచారం అందించగా.. వారు సంఘటనా స్థలానికి చేరు కొని ఫియూష్ను, మిగతా వారిని దవాఖానకు తరలించారు. కారులో ఇరుక్కున్న సురేఖ మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలి భర్త ఫి యుష్ కారును నడిపిస్తున్నట్లు సమాచారం. ఈయన కూడా వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.