కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్( Devapur ) మద్దిమాడ స్వయంభు రాజరాజేశ్వర దేవాలయం శివరాత్రి ( Shivaratri ) వేడుకలకు ముస్తాబైంది. ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా శనివారం నుంచి వేడుకలు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఆలయాన్ని పూలు, దీపాలతో ముస్తాబు చేశారు. నలువైపులా స్వాగత తోరణాలు, భక్తులు స్వయంభు శివాలయం సన్నిధికి చేరుకునేందుకు వీలుగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
15న శివరాత్రి సందర్బంగా పార్వతి పరమేశ్వర కల్యాణం , సోమవారం 16న రథయాత్ర, శోభ యాత్ర ఉంటుందని అర్చకులు అర్చకులు గొల్లపల్లి మారుతీశ్వర ఆచార్యులు, బ్రహ్మ శ్రీ బెజ్జంకి సాయి నాథ ఆచార్య తెలిపారు. ప్రత్యేక లడ్డూ ప్రసాద వితరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు దేవాలయ కమిటీ చైర్మన్ యనగందుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తట్ర భీం రావు తెలిపారు.