ఆసిఫాబాద్, ఫిబ్రవరి15: క్రమశిక్షణతో పాటు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్ కుమార్ సూచించారు. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్లో 15 రోజుల పాటు సాగిన జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది మొబిలైజేషన్ కార్యక్రమం గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా వారి నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.
పరేడ్కు అడ్మిన్ ఆర్ఐ పెద్దన్న ప్లా టూన్ కమాండర్గా వ్యవహరించారు. ఎస్పీ సురేశ్ కుమార్ మాట్లాడుతూ మొబిలైజేషన్ కార్యక్రమం ద్వారా శారీరక ధృడత్వంతో పా టు మానసికోల్లాసం కూడా లభిస్తుందన్నా రు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అడిషనల్ ఎస్పీ అచ్చేశ్వర్రావు, ఎం టీవో ఆర్ఐఅంజన్న, సిబ్బంది పాల్గొన్నారు.
బదిలీపై వెళ్తున్న ఏఎస్పీ అచ్చేశ్వర్రావు, డీఎస్పీ రమేశ్తో పాటు పలువురిని ఎస్పీ గురువారం సన్మానించారు. ఉద్యోగంలో బదిలీలు సహజమని, బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే గుర్తింపు లభిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. వసుధ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఏఎస్పీ అచ్చేశ్వర్రావు చేపట్టిన సేవా కార్యక్రమాలను అభినందించారు. ఆసిఫాబాద్, కాగజ్నగర్ డీఎస్పీలు సదయ్య, కరుణాకర్, టాస్ఫోర్స్, ఎస్బీ సీఐ రాణాప్రతాప్, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, డీపీవో సిబ్బంది పాల్గొన్నారు.