ఆదిలాబాద్ టౌన్, నవంబర్ 26 : ఆదిలాబాద్లోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వద్ద లాహుజీ శక్తి సేన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం క్రాంతి గురు లాహుజీ సాల్వే 228వ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవ్ లమ్టిరే అన్నారు. శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ జయంతి వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మధుకర్, సాంబశివ, సూర్యకాంత్, శ్యాం జాదవ్, జీవ వైవిధ్య కమిటీ సభ్యుడు తిరుపతి, ప్రకాశ్ పాల్గొన్నారు.