కుమ్రం భీం ఆసిఫాబాద్ : అక్రమంగా నిల్వ చేసిన నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వాంకిడి మండల కేంద్రానికి చెందిన సయ్యద్ ముస్తఫా అనే వ్యాపారి గోదాంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు నిల్వ ఉంచాడనే విశ్వసనీ సమాచారం మేరకు వాంకిడి ఎస్సై దీకొండ రమేష్ గోదాంలో వాంకిడి పోలీస్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించి గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు. రూ.77,830 ఉంటుందని గోదాం యజమాని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రమేష్ తెలిపారు.
ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను అమ్మినట్లు తెలిస్తే వాంకిడి పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో వాంకిడి ఏ ఎస్సై పోషెట్టి, హెడ్ కానిస్టేబుల్ మధుసూధన్, తదితరులు పాల్గొన్నారు.