కుమ్రం భీం ఆసీఫాబాద్ : నిషేధిత గుట్కా ప్యాకెట్లును టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని కెరమెరి మండల కేంద్రంలో గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్నారనే సమాచరం మేరకు తనిఖీలు చేపట్టారు. ఫిరోజ్ అనే వ్యక్తికి చెందిన కిరాణా షాపులో సోదాలు నిర్వహించి నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎవరైనా అక్రమంగా గుట్కాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఐ , సందీప్, వెంకటేష్, కానిస్టేబుల్ రమేష్, మధు, తిరుపతి, సంజయ్, పాల్గొన్నారు.