మంచిర్యాల జిల్లాకు చేరుకున్న 291..
మార్కెట్ కమిటీ గోదాంలో భద్రం
త్వరలో కలెక్టర్ ఆధ్వర్యంలో పంపిణీ
మంచిర్యాల అర్బన్, మార్చి 20 : జిల్లా కేంద్రానికి 291 బ్యాటరీ ట్రై సైకిళ్లు శనివారం చేరుకున్నా యి. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ఆవరణలో ఈ నెల ఒకటి, రెండు తేదీల్లో జరిగిన శిబిరంలో కాళ్లు పని చేయకుండా మిగతా అవయవాలు బాగా ఉన్న వారి వద్ద నుంచి బ్యాటరీ ట్రై సైకిల్ కోసం దరఖాస్తు తీసుకున్నారు. 291 బ్యాట రీ సైకిళ్లు శనివారం కంటేయినర్లో జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో గల గోదాముల్లో భద్రపరిచారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ఖాన్ మా ట్లాడారు. ఒక్కో బ్యాటరీ ట్రై సైకిల్ రూ. 45 వేలు ఉంటుందన్నారు. త్వరలో కలెక్టర్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు పంపిణీ చేస్తామని తెలిపారు.