దండేపల్లి, జూన్ 19:రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల స భ్యులకు స్త్రీనిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తుం డడంతో స్వావలంబన దిశగా అడుగులు వేస్తు న్నారు. తమకు అందుతున్న రుణాలతో స్వ యం ఉపాధి పొందుతూ కుటుంబాలకు అండ గా నిలుస్తున్నారు. 2021-22గాను తెలంగా ణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(టీసెర్ప్) ఆ ధ్వర్యంలో రూ.288 కోట్ల రుణాల పంపిణీ ల క్ష్యంగా పెట్టుకోగా, దాన్ని దాటి రూ.308 కో ట్లు అందజేశారు. దీంతో అతివలు ఏకమై.. పొ దుపు మంత్రం పాటిస్తూ వివిధ వ్యాపారాల ద్వా రా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు.
ప్రభుత్వం అందించే స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ రుణాలను మ హిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. రుణాలు పొందిన మహిళలు జీవనోపాధి పొందుతున్నారు. స్థానికంగా స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకొని కు టుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. ఆర్థికంగా చేయూతనందిస్తున్నారు. ప్రధానంగా పాడి గేదెలు, కిరాణా దుకాణాలు, పిండి గిర్నీలు, గొర్రెలు, మేకలు, హోటల్, కూరగాయల అమ్మకం, ఫొటోస్టూడియో, బట్టల అమ్మకం, గాజుల దుకాణం, బ్యూటీపార్లర్లు, సెల్ఫోన్ రిపేర్, జిరాక్స్, కుట్టు మిషన్, ఎంబ్రాయిడరీ, మొదలగు వాటిని ఏర్పాటు చేసుకొని కుటుంబాలను పోషించుకుంటున్నారు.
రుణం ఎలా పొందాలి..
స్త్రీనిధి రుణం పొందాలనుకునే సభ్యులు మండలాల్లోని వెలు గు కార్యాలయాలకు వెళ్లాల్సిన పనిలేదు. అందుబాటులో ఉన్న వీవోలను సంప్రదించి దరఖాస్తు అందజేస్తే సరిపోతుంది.అన్ని పత్రాలు సమర్పించిన తరువాత 48 గంటల్లోనే సభ్యురాలి వ్యక్తిగత ఖాతాకు రుణం మొత్తాన్ని మంజూరు చేస్తారు. ఆయా సంఘాలు కచ్చితంగా స్త్రీనిధిలో పొదుపు కలి గి ఉండాలి. వారే అర్హులని అధికారులు చెబుతున్నారు. వా యిదాలు కూడా ఇంటి నుంచే చెల్లించే అవకాశం ఉంది.
99.50 శాతం రికవరీ చేస్తున్నాం
లక్ష్యానికి మించి రుణాలు ఇప్పించడంతో పాటు, రికవరీలు కూడా 99.50 శాతా నికి దగ్గరగా చేస్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్న రుణాలను స్వయం సహాయక సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి. రుణాలు సకాలంలో చెల్లించి మంచి పేరు తెచ్చుకోవాలి. మళ్లీ రుణాలు పొందేందుకు అర్హత సంపాదించాలి. జిల్లాలో టార్గెట్కు మించి రుణాలు అందించి ముందంజలో ఉన్నాం. ఈ యేడా ది కూడా అదే స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం. -స్వర్ణలత, జిల్లా ప్రాజెక్టు మేనేజర్
ఆర్థికంగా భరోసా లభించింది
స్త్రీనిధి ద్వారా మొదటిసారిగా రూ.50 వే ల రుణం తీసుకున్న. సక్రమంగా చెల్లించి న తరువాత అధికారులు మళ్లీ నాకు రూ.1లక్ష రుణం మంజూరు చేసిన్రు. దీంతో ఇంట్లోనే మ్యాచింగ్ సెంట ర్(బట్టల దుకాణం)పెట్టుకున్న. ప్రతి నెలా రూ.10వేలకు పైగానే ఆదాయం వ స్తున్నది. నా భర్త కూరగాయల వ్యాపా రం చేస్తుండే. కరోనాతో వ్యాపారం సరి గ్గా నడవకపోవడంతో సొంతంగా వ్యాపా రం చేద్దామనుకున్నా. రుణం మంజూరు కాగానే దుకాణం ప్రారంభించినం. నా భర్తకు తోడుగా నేను కూడా వ్యాపారం లో భాగస్వామి కావడంతో ఇద్దరు పి ల్లలను మంచిగా చదివించుకుంటున్నం.
-దావనపెల్లి ప్రేమలత
కిరాణం పెట్టుకున్నా
నేను రేణుకా గ్రూప్ సభ్యురాలిని. స్త్రీనిధి ద్వారా మొదటిసారిగా రూ.50 వేల రుణం తీసుకున్న. అవి కట్టిన. మళ్లీ గి ప్పుడు రూ.75 వేల రుణం ఇచ్చిన్రు. కిరాణం పెట్టుకోవడంతో కుటుంబ పోషణకు ప్రతి నెలా రూ.10వేల కు పైగానే సంపాదిస్తున్న. మహిళలు ప్రతి ఒక్కరూ గ్రూపులో చేరితే ఎంతో లాభం ఉంటది. స్త్రీ నిధి రుణాలతో వ్యాపారం చేసి, స్వయం ఉపాధి పొందవచ్చు. -దుర్గం లావణ్య, తాళ్లపేట
స్వశక్తితో ఎదిగేందుకు తోడ్పాటు
మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు స్త్రీనిధి రుణాలు ఎంతగానో ఉప యోగపడుతున్నయ్. నేను సిద్ధ్ది వినాయక గ్రూప్ సభ్యురాలిని. స్త్రీని ధి ద్వారా మొదటిసారి రూ.50 వేల రుణం తీసుకున్న. సక్రమం గా చెల్లించిన తరువాత అధికారులు మళ్లీ నాకు రూ.1లక్ష రుణం మంజూరు చేసిన్రు. దీంతో ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్ తె చ్చుకు న్న. దీంతో మహిళలు పట్టణాలకు పోకుండా ఇక్కడే ఆకర్షణీ యమై న డిజైన్లతో బ్లౌజులు, ఇతర వస్ర్తాలు కుట్టించుకుంటున్నరు.
-ఎర్రం వినీష