కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో దళిత బంధు పథకం కింద ఎంపిక చేయబడ్డ లబ్ధిదారులు దానిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో దళిత బంధు లబ్ధిదారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప పథకాన్ని తీసుకువచ్చిందని అన్నారు.
దీనిని సరైన విధంగా ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అంతకుముందు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు దళిత బంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులు చేయాలనుకుంటున్న వ్యాపారాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ ఈడీ సజీవన్, డీఆర్డీవో సురేందర్, దళిత బంధు లబ్ధిదారులు పాల్గొన్నారు.