కుమ్రంభీం ఆసిఫాబాద్ : ‘పోషణ్ అభియాన్’ కేటగిరిలో 2021 సంవత్సరానికి గాను జిల్లాకు ప్రజా పరిపాలన విభాగానికి ప్రధాన మంత్రి ఎక్సలెన్సీ అవార్డు వచ్చింది. ఈ అవార్డును గురువారం నేషనల్ సివిల్ సర్వీస్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అందుకున్నారు.
ఈ అవార్డు రావడంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వరుణ్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారు. ఇందుకు ఐ.సి.డి.ఎస్., డి.ఆర్ డి.ఏ., ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది ప్రత్యేక సహకారం అందించారు.