కొమురం భీమ్, ఆసిఫాబాద్: సార్వత్రిక ఎన్నికల కోడ్ (Election Code) అమల్లోకి వచ్చిన సందర్భంగా పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. ముఖ్యంగా అంతర్రాష్ట్ర చెక్పోస్టు (Check posts) ల వద్ద గట్టి నిఘా ఉంచారు. ఇందులో భాగంగా కొమురం భీమ్, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలం వెంకట్రావుపేట అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ఆదివారం వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో మహారాష్ట్ర (Maharashtra) కు చెందిన నరులే భరత్ అనే వ్యక్తి బొలెరోలో రూ. 2,72,560 ను తరలిస్తుండగా వాటిని పట్టుకున్నారు. నగదుకు సంబంధించి సరైన పత్రాలు చూపని కారణంగా నగదును సీజ్(Cash Seize) చేసినట్టు సీఐ సాధీక్ పాషా తెలిపారు.
అదేవిధంగా చంద్రపూర్ జిల్లా పంబర్న కు చెందిన నజీమ్ సలీమ్ బక్స్ అనే మరో వ్యక్తి బొలెరోలో రూ. 1.84 లక్షలను తరలిస్తుండగా పట్టుకున్నామని ఆయన వివరించారు. ఈ తనిఖీలో కాగజ్నగర్ డీఎస్పీ పి కరుణాకర్, సిర్పూర్ ఎస్ఐ ధీకొండ రమేష్, సిర్పూర్ టీ జడ్పీఎస్ఎస్ జూనియర్ అసిస్టెంట్ తదితరులు ఉన్నారు.