కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని సిర్పూర్. టి మండల కేంద్రంలో గల నాగమ్మ చెరువులో బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తామని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఈమేరకు విగ్రహ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. సోమవారం విగ్రహ తయారీ కేంద్రంలో తుది మెరుగులు దిద్దుకుంటున్న సంబంధిత విగ్రహాన్ని ఎమ్మెల్యే పరశీలించారు. మరో నెల రోజుల్లో విగ్రహ తరలింపునకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్దిరోజుల్లోనే నాగమ్మ చెరువులో బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మిని ట్యాంక్ బండ్గా రూపుదిద్దుతామని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు. అలాగే పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే మా లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.