ఉమ్మడి జిల్లాలో నలుగురి దుర్మరణం
మరొకరికి తీవ్ర గాయాలు
వేర్వేరు చోట్ల ఎద్దు, మూడు గొర్లు మృత్యువాత
బజార్హత్నూర్/తాంసి/భీంపూర్/జైనూర్/భీమారం, అక్టోబర్9;పిడుగు.. నలుగురిని బలితీసుకుంది. వేర్వేరు చోట్ల పొలం పనులకు వెళ్లిన ముగ్గురు కూలీలు, ఓ రైతుపై పడడంతో మృతి చెందగా, ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్లో బనియ గరన్సింగ్ (45), బనియ ఆశాబాయి (30), తాంసి మండలం బండలనాగపూర్లో రాథోడ్ దీపాలి (13), ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం గుడామామడలో గణపతి (35) శనివారం దుర్మరణం చెందగా, మరో రెండు చోట్ల నాలుగు మూగజీవాలు కూడా మృత్యువాత పడ్డాయి.
ఉమ్మడి జిల్లాలో శనివారం పలుచోట్ల ఉరుము లు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసిం ది. వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు నలుగురు చనిపోగా, ఎద్దు, మూడు గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
నార్నూర్,అక్టోబర్ 9 : మండలంలో శనివా రం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. మహాగావ్, ఖడ్కి కల్వర్టులపై నుంచి వరద పారడం తో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
భీంపూర్ మండలంలో..
భీంపూర్, అక్టోబర్ 9: మండలంలో శనివారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురిసింది. పెన్గంగకు భారీగా వరద రావడంతో సరిహద్దు గుబ్డీ, గోమూత్రి, అంతర్గాం, వ డూర్, గొల్లగఢ్- మహారాష్ట్ర రాజ్పేట్, చినార్లి , ఇవ్రీల నడుమ నాటుపడవలను నడపలేదు. ఆదిలాబాద్ – కరంజి(టీ) 50 కిలోమీటర్ల రో డ్డుపై ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. సోయా , పత్తి పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పిడుగుపాటుతో ఇద్దరు మృతి
బజార్హత్నూర్ అక్టోబర్9: బుర్కపల్లిలో పిడుగుపాటుతో ఇద్దరు వ్యవసా య కూలీలు మృతి చెందారు. ఎస్ఐ ఉదయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బనియ గరన్సింగ్ (45), బని య ఆశాబా యి (30) సోయా పంట కోస్తున్నా రు. అయి తే ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూ డిన భారీ వర్షం కురవడంతో చెట్టుకిందకు వెళ్లారు. అక్కడే పిడుగుపడడంతోగరన్సింగ్ అక్కడిక్కడే మృతి చెందగా, ఆశాబాయి తీవ్రం గా గాయపడ్డది. గమనించిన స్థానిక రై తులు, కూలీలు ఆశాబాయిని రిమ్స్కు తరలిస్తుండగా, మార్గమధ్యంలో చనిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
బండలనాగపూర్లో యువతి ..
తాంసి, అక్టోబర్ 9: బండలనాగపూర్లో పిడుగుపాటుకు బాలిక మృతి చెందింది. ఎస్హెచ్వో రమణారెడ్డి, యువతి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకా రం.. రాథోడ్ దీపాలి(15) శనివారం పత్తి ఏరేందుకు వెళ్లిం ది. మధ్యాహ్నాం భారీ వర్షం కురవడంతో చెట్టుకిందికి చేరుకున్నారు. అక్క డ పిడుగుపడడంతో దీపాలి అపాస్మరక స్థితిలోకి వెళ్లింది. గమనించిన చేను యజమాని బాలిక తండ్రికి సమాచారం అందించి, ఆదిలాబాద్లోని రి మ్స్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతురాలి తండ్రి రాథోడ్ దిలీప్ ఫిర్యాదు కేసు నమో దు చేసినట్లు ఎస్హెచ్వో రమణారెడ్డి తెలిపారు.
గూడమామడలో రైతు..
జైనూర్, అక్టోబర్ : మండలంలోని గూడమామడకు చెందిన గణపతి (35) రైతు పిడుగుపడి మృతి చెందాడు. గణపతి తన చేనులో అదే గ్రామానికి చెందిన రాముతో కలిసి పను లు చేస్తున్నాడు. మధ్యాహ్నం భారీ వర్షం పడ గా చేనులోని చెట్టుకింద కూర్చున్నారు. వారిపై పిడుగుపడగా గణపతి అక్కడికక్కడే మృతిచెందగా, రాముకు తీవ్ర గాయాలయ్యాయి. రా మును చికిత్స కోసం ఉట్నూర్ దవాఖానాకు తరలించినట్లు స్థానికులు తెలిపారు.
పొలంపల్లిలో మూడు గొర్రెలు..
భీమారం, అక్టోబర్ 9 : మండలంలోని పొలంపల్లిలో గొర్రెల మందపై పిడుగు పడడంతో రెండు గొర్రెలు, మేకపోతు మృతి చెందింది. అధికారులు ఆదుకోవాలని భీమారానికి చెం దిన తువ్వ మల్లేశ్, అమరగని రామయ్య, ధరవేణి శంకర్ కోరుతున్నారు.
పిప్పల్కోటిలో ఎద్దు..
భీంపూర్, అక్టోబర్9 : మండలంలోని పిప్పల్కోటి గ్రామానికి చెందిన రైతు షేక్ ముజ్జుకు చెందిన ఎద్దు శనివారం మధ్యాహ్నం పిడుగుపాటుతో మృతి చెందింది. ఎద్దు విలువ రూ.60 వేలు ఉంటుందని, విషయం సర్పం చ్, అధికారులకు విన్నవించానని బాధిత రైతు పేర్కొన్నారు.