సీఎం ప్రకటనతో కార్మికులకు 29శాతం వాటా
కష్టకాలంలోనూ కేసీఆర్ పెద్ద మనసు
సంస్థకు రూ.272.6 కోట్ల ప్రాఫిట్ మాత్రమే వచ్చినా రికార్డు స్థాయిలో ప్రోత్సాహం
మొత్తంగా ఒక్కొక్కరికీ రూ.1.30లక్షలు వచ్చే అవకాశం
కార్మికులకు ఈ నెల డబ్బులే డబ్బులు
ఆనందంలో కార్మికులు
శ్రీరాంపూర్/తాండూర్, అక్టోబర్ 5: సింగరేణి కార్మికులకు డబుల్ ధమాకా దక్కింది. సంస్థ 2020-21 ఆర్థిక సంవత్సరంలో సాధించిన రూ.272 కోట్ల లాభాలపై కార్మికులకు సీఎం కేసీఆర్ ఆదేశాలతో వాటా ప్రకటించారు. కరోనా కష్టకాలంలోనూ సింగరేణి సంస్థ నల్లసూర్యుల ప్రతిభతో లాభాలు ఆర్జించించగా, ప్రతి యేడు మాదిరాగానే లాభాల వాటాను ప్రకటించారు. కరోనా సంక్షోభంలోనూ గతేడాది రూ.272.6కోట్లు సాధించడంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా 29శాతం వాటాగా ప్రకటించారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘమైన టీబీజీకేఎస్ కృషితో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ కేవలం 50.58మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించింది. కరోనా మహమ్మరి కారణంగా దేశంలో ఏ పరిశ్రమలో అనుకున్న మేర రాణించనప్పటికీ సింగరేణి సంస్థ మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోని లాభాలు ఆర్జించింది. అసలు లాభాలు వస్తాయా? అనే అనుమానాలను పటాపంచాలు చేస్తూ రూ.272.6కోట్ల ప్రాఫిట్ సాధించింది. ఈ క్రమంలో సింగరేణి చూపిన ప్రతిభకు సీఎం కేసిఆర్ ఫిదా అయి, నల్లసూర్యులకు అండగా నిలవాలనే ఉద్దేశ్యంతో రికార్డు స్థాయిలో 29శాతం వాటాను ప్రకటించారు.
దీపావళికి పీఎల్ఆర్ బోనస్..
కోల్ఇండియా యాజమాన్యం ఖరారు చేసిన పీఎల్ఆర్ బోనస్ను ఈ సారి దీపావళికి ముందుగానే ఇవ్వనున్నారు. జా తీయ కార్మిక సంఘాలు కోల్ఇండియాతో చేసుకున్న ఒప్పం దం మేరకు సింగరేణిలో చెల్లింపులు చేయనున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను పీఎల్ఆర్ బోనస్ను రూ.72,500గా నిర్ణయించారు. గతేడాది రూ.68,500గా చెల్లించారు. రెండేళ్లతో పోల్చితే ఈసారి కోల్ఇండియా, సింగరేణిలో కరోనా కారణంగా గణనీయంగా లాభాలు తగ్గినప్పటికీ బోనస్ను పెంచుతూ నిర్ణయం తీసుకోగా, కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. వాస్తవానికి పీఎల్ఆర్ బోనస్ను రూ.80వేల వరకు సాధిస్తామని జాతీయ కార్మిక సంఘాలు పేర్కొన్నప్పటికీ చివరకు రూ.72,500గా నిర్ణయించారు. కోల్ఇండియాలో సంస్థ ప్రతిభ ఆధారంగా దసరా పండుగకు ముందుగా పీఎల్ఆర్ బోనస్ను చెల్లిస్తారు. పీఎల్ఆర్ బోనస్ను సింగరేణిలో మాత్రం దీపావళి పండుగకు ముందుగా చెల్లిస్తారు. కోల్ఇండియాలో ఇచ్చే లాభాల బోనస్తో పాటు సింగరేణిలో కార్మికులకు లాభాల వాటా చెల్లిస్తున్నారు. 10శాతంతో ప్రారంభమైన లాభాల వాటా 2020-21 ఆర్థిక సంవత్సరానికి 29శాతానికి చేరుకుంది. దేశ వ్యాప్తంగా బొగ్గు గని కార్మికులకు చెల్లించే పీఎల్ఆర్ బోనస్లో ప్రతి ఏటా కొంత మేర వృద్ధితో ముందుకు సాగుతూనే ఉంది. 2011లో 21వేలతో ప్రారంభమైన లాభాల బోనస్ ఈ సంవత్సరం మాత్రం రూ.72,500గా కార్మికుడికి చెల్లిస్తున్నారు.
సంక్షోభంలోనూ 29 శాతం వాటా టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్
కరోనా సంక్షోభంలోనూ సింగరేణి కార్మికులకు సంస్థ లాభాల్లో 29శాతం వాటాను చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్ పేర్కొన్నారు. మంగళవారం ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డితో సీఎం కేసీఆర్ను కలిసి లాభాల వాటా కోరినట్లు తెలిపారు. గతేడాది మాదిరిగానే 28శాతం లాభాల వాటాను ఈ సంవత్సరం 29 శాతానికి పెం చి ప్రకటించడంపై కార్మికులు సంతోషంగా ఉన్నారన్నారు. మొత్తంగా రూ. 272కోట్లు కార్మికులకు అందనున్నాయని పే ర్కొన్నారు. ఒక్కో కార్మికుడికి రూ. 30వేల నుంచి రూ.40 వేల వరకు అందుతాయని చెప్పారు. కార్మికులకు 29శాతం లాభాల వాటా ఇప్పించడంపై కేసీఆర్కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఇది వరకు ఎవరూ పట్టించుకోలే
గతంలో సింగరేణికి ఎన్ని లాభాలు వచ్చినా మాకు ఏ మాత్రం వాటా ఇవ్వలే దు. ఇచ్చినా కూడా లాభాలు అరకొరగా ఉండేవి. కరోనా సంక్షో భంలోనూ సింగరేణి 272.6 కోట్ల లాభాలను గడించడం గొప్ప విష యం. సింగరేణి పనితీరును మెచ్చుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ లాభాల్లో వాటా గత సంవత్సరం కంటే ఒక్క శాతం అదనంగా పెంచి ఇస్తామని ప్రకటించారు. ఇది మాకెంతో సంతోషాన్నిస్తుంది. ముఖ్యమంత్రి కార్మికుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఎంపీ కవిత, టీబీజీకేఎస్ కార్మిక సంఘం సహకారంతో 29 శాతం పెంచి ఇచ్చారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
ఏ కంపెనీలో లేని విధంగా సింగరేణికి వచ్చిన లాభాల నుంచి వాటా ఇస్తున్నారు. 2020లో 28 శాతంగా ఉన్న లాభాల వాటాను సీఎం కేసీఆర్ 29 శాతానికి పెంచి ఇస్తున్నారు. మాకు మరింత లాభం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏటేటా లాభాలవాటా పెరుగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్కు కార్మికులపై ఉన్న ప్రేమను నిరూపించుకుంటున్నారు. సారుకు రుణపడి ఉంటాం.