నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములవ్వాలి
పోడు రైతులకు ఇబ్బందుల్లేకుండా చేస్తాం
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
ఆసిఫాబాద్, కెరమెరి మండలాల్లో వివిధ కార్యక్రమాలకు హాజరు
పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఎమ్మెల్యే సక్కు
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 5(నమస్తే తెలంగాణ): భా వితరాల బాగు కోసమే ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టిందని అటవీ పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మం త్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని జైనూర్, కెరమెరి మండలాలతోపాటు జిల్లా కేంద్రంలో నిర్వహించిన పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎ మ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్తో కలిసి సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ని చిల్డ్రన్స్ పార్క్లో ఆయన మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 10 వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించాలని, సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సహకారంతోనే ఈ కార్యక్రమం విజయవంతమవుతుందన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు బాగా పనిచేస్తున్నారని అభినందించారు. జిల్లా కేంద్రం లో చేపట్టిన కలెక్టరేట్ నిర్మాణం త్వరలోనే పూర్తికానుందని తెలిపారు. కొవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ అధికార యంత్రాంగం అద్భుతంగా పనిచేసిందని కొనియాడారు. వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
‘పోడు’ ఇబ్బందుల్లేకుండా చూస్తాం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడురైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఐకే రెడ్డి తెలిపారు. వ్యవసాయం, పోడు భూముల సమస్యలపై కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 2005 కంటే ముందుకు నుంచి పో డు భూములు సాగుచేసుకుంటున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అటవీ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ రెండు జిల్లాల్లోని నోటిఫైడ్ ఏరియాల్లో దాదాపు 35 వేల ఎకరాల భూమిని గిరిజనేతరులు సాగుచేసుకుంటున్నారని, వీరికి రైతు బంధు పథకాన్ని వర్తింపజేయాలని గతంలోనే ్ర పభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఈ మేరకు పూర్తిస్థాయి వివరాలతో కూడిన నివేదికను అధికారులు వెంటనే అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని తెలిపారు.
కెరమెరి, జూలై 5: మానవాళి మనుగడకు ప్రతి ఒక్కరూ మొ క్కలు నాటాల్సిన అవసరం ఉందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మండలంలో జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆ త్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్, కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి, డీఎఫ్వో శాంతారాంతో కలిసి పర్యటించారు. వారికి మండల ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. హరితహారం కార్యక్రమాన్ని జెండా ఊపి అట్టహాసంగా ప్రారంభించారు. మండల కేంద్రం తో పాటు సాక్డ, ఝరి మోడి, మెట్టపిప్రి గ్రామంలోని ప్రధాన రహదారిపై మొక్కలు నాటారు. మంత్రి మాట్లాడుతూ.. ఆది లాబాద్ జిల్లాకు పూర్వ వైభవం తెచ్చేలా మొక్కలు నాటి సంర క్షించాలని పిలుపునిచ్చారు. తరగని అటవీ సంపదను భావి త రాలకు అందిద్దామని సూచించారు. జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు మా ట్లాడుతూ.. ఆపత్కాలంలోనూ సంక్షేమ పథకాలను ఆపకుండా ప్రభుత్వం కొనసాగిస్తున్నదన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదోరావ్, డీఎస్పీ అచ్చేశ్వర్రావ్, సీఐ సుధాకర్, తహసీల్దార్ సమీర్ అహ్మద్ ఖాన్, ఎంపీపీ పెందోర్ మోతీ రాం, జడ్పీటీసీ సెడ్మాకి ధుర్పతాబాయి, ఎంపీడీవో దత్తా రాం, వైస్ ఎంపీపీ అబూల్ కలాం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మ న్ మునీర్ అహ్మద్, ఎస్ఐ రమేశ్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఏపీ వో నగేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాథోడ్ ఉత్తం నా య క్, నాయకులు షేక్ యూనుస్, కోవ దేవ్రావ్, ఆత్రం లక్ష్మణ్రావ్, మడావి రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.