ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, జూలై 2 : గ్రామాల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. మోతుగూడ, రౌటసంకెపల్లిలో శుక్రవారం ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను గురి్ంతచి పల్లెప్రగతి ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు. పవర్ డే సందర్భంగా విద్యుత్ సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్, సర్పంచ్లు, కార్యదర్శులు, గ్రామస్తులు ఉన్నారు.
పల్లెపగ్రతితో సమస్యలు పరిష్కారం : ఎమ్మెల్యే ఆత్రం సక్కు
పల్లెప్రగతితో ప్రజా సమస్యలు పరిష్కారమవుతున్నాయని ఎ మ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. వాంకిడి మండలంలోని సవాతి గ్రామంలో గురువారం రాత్రి ఆయన పల్లె నిద్ర చేశారు. శుక్రవారం ఉదయం సవాతి, కొలంగూడ, చిచ్చుపల్లిలోని కాలనీ ల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మి షన్ భగీరథ నీళ్లు రావడం లేదని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, 10 రోజుల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం శ్మశాన వాటిక, డంప్ యార్డును పరిశీలించి ప్రకృతివనాల్లో మొక్కలు నాటారు. ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ అజయ్కుమార్, ఎంపీటీసీ మారుతి, సర్పంచ్లు దేవ్రావు, జంగు, నాయకులు దీపక్ముండే, సదాశివ్, తహసీల్దార్ మధుకర్, అధికారులు, గ్రామస్తులు ఉన్నారు.
మొక్కలు నాటిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప..
పెంచికల్పేట్, జూలై 2 : మండలంలోని ఎల్లూరు, చేడ్వాయి గ్రామాల్లో ఎమ్మెల్యే కోనప్ప మొక్కలు నాటారు. అనంతరం ఎల్లూర్లో టీఆర్ఎస్ నాయకుడు బాల్నె సత్యనారాయణ కూతురి పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఎంపీపీ జాజిమొగ్గ సుజాత, జడ్పీటీసీ సముద్రాల సరిత, సర్పంచ్లు దుర్గం రాజన్న, సుజాత, జాజిమొగ్గ శ్రీనివాస్, టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు చౌదరి తిరుపతి, మండల కోఆప్షన్ సయ్యద్ సాజీద్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో గంగాసింగ్, ఏపీవో సతీశ్, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మార్లవాయిని ఆదర్శంగా తీర్చిదిద్దుదాం : కలెక్టర్ రాహుల్రాజ్
జైనూర్, జూన్ 2: మార్లవాయిని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతామని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. గురువారం రాత్రి గ్రామంలో పల్లె నిద్ర చేశారు. అంతకుముందు గ్రామ పరిస్థి తులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్ నిషేధిత గ్రామంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. గర్భిణులు రక్తహీ నత బారిన పడకుండా చూడాలని వైద్యాధికారిని ఆదేశించారు. ఉదయం శ్మశాన వాటిక, డంప్యార్డు , ప్రకృతి వనాన్ని సందర్శించారు. గ్రామానికి సీసీ రోడ్లు మంజూరు చేయాలని, 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని, గతంలో తవ్వించిన బావి నిర్మాణ పనులకు నిధులు కేటాయించాలని కలెక్టర్ను గ్రా మస్తులు కోరారు. అనంతరం దుబ్మగూడ గ్రామాన్ని సం దర్శించారు. ప్రకృతి వనంలో మొక్కలు, సెగ్రిగేషన్ షెడ్లో వర్మీకంపోస్టు ఎరువుల తయారీ, శ్మశాన వాటిక, డంప్ యార్డు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్రావ్, తహసీల్దార్ సాయన్న, ఎం పీడీవో ప్రభుదయా, ఏటీడబ్ల్యూవో ఆత్రం భాస్కర్, సర్పంచ్లు కనక ప్రతిభ, మడావి భీంరావ్, నాయకులు కనక వెంకటేశ్వర్రావ్, తదితరులు ఉన్నారు.
పల్లెలు ప్రగతి బాటలో నడవాలి : అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డి
కెరమెరి, జూలై 2: పల్లెలు ప్రగతి బాటలో నడవాలని అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. మండలంలోని జోడేఘాట్లో గురువారం రాత్రి ఆయన పల్లెనిద్ర చేపట్టారు. అంతకుముం దు పల్లెప్రగతిలో చేపట్టిన శ్మశాన వాటిక, సెగ్రిగేషన్ షెడ్, డంప్ యార్డు, నర్సరీ, పల్లెప్రకృతి వనంతో పాటు గ్రామాన్ని సందర్శించి పారిశుద్ధ్య పనులు, మౌలిక సదుపాయలను ఆదివాసులను అడిగి తెలుసుకున్నారు. ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం రాత్రి అక్కడే పల్లెనిద్ర చేశారు. ఉదయం బాబేఝరి, సుర్దాపూర్, గోయగాం గ్రామాలను సం దర్శించారు. అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉండడంతో సం బంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ సమీర్ అహ్మద్ ఖాన్, ఎంపీపీ పెందోర్ మోతీరాం, ఎంపీడీవో దత్తారాం, ఎస్ఐ రమేశ్, ఏపీవో నగేశ్, ఆయా శాఖల అధికారులు, సర్పంచ్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కాగజ్నగర్ రూరల్, జూలై 2: ఈస్గాం, నజ్రుల్నగర్, కోసిని, వంజీరి గ్రామాల్లో శుక్రవారం పవర్డే సందర్భంగా వేళాడుతున్న విద్యుత్ వైర్ల్లు, ఒరిగిన స్తంభాలను అధికారులు సిబ్బందితో కలిసి సరి చేశారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్లు, పాలకవర్గ సభ్యులు పారిశుధ్యపనులు చేపట్టారు.
కౌటాల రూరల్, జూలై 2: మండలంలోని గురుడ్పేట్ గ్రామం లో ఎంపీవో శ్రీ ధర్ గురువారం రాత్రి పల్లె నిద్ర చేపట్టారు. శుక్రవారం ఉదయం గ్రామంలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మొక్కలను నాటారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ కావ్య, ఎస్బీవో ప్రభాకర్, సర్పంచ్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.
రెబ్బెన,జూలై2: పల్లెప్రగతిలో భాగంగా శుక్రవారం రోడ్లకిరువైపులా పిచ్చిమొక్కలను తొలగించారు. అదేవిధంగా పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీ వేముర్ల సంతోష్, ఏఎంసీ చైర్పర్సన్ పర్లపల్లి వనజ, వైస్ ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, సర్పంచ్లు చెన్న సోమశేఖర్, బొమ్మినేని అహల్యాదేవి, పోటు సుమలత, ఉపసర్పంచ్లు బొదాసు దేవానంద్, మడ్డి శ్రీనివాసగౌడ్, అశోక్, పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ పాల్గొన్నారు.
కౌటాల, జూలై 2 : బస్టాండ్ ఏరియాలో పవర్ డే సందర్భంగ చేపట్టిన పనులను ఎంపీపీ విశ్వనాథ్, ఏడీఈ రాజేశ్వర్ పరిశీలించారు. తెగిన విద్యుత్ తీగలను సరిచేయడంతో పాటు వేలాడుతున్న వైర్లు, ఒరిగిన స్తంభాలను సరిచేశారు. గుడ్లబోరి గ్రా మంలో కొత్త స్తంభాలను వేశారు. డ్రైనేజీల చెత్తను తొలగించా రు. రోడకిరువైపులా మొక్కలు నాటారు. అక్రమంగా వెలసిన టేలాలను తొలగించి, రోడ్డు విత్తరణను పంచాయతీ సిబ్బంది నిర్వహించారు. కో ఆప్షన్ సభ్యుడు అజ్మత్ అలీ, సర్పంచ్ వొ జ్జల మౌనిశ్, ఉపసర్పంచ్ పసునూరి తిరుపతి, కార్యదర్శి సా యికృష్ణ, ఏఈ రవీందర్, సబ్ ఇంజినీర్ అజయ్, ఎల్ఐ మాధవ్, జెఎల్ఎం లక్ష్మణ్ పంచాయతీ సిబ్బంది ఉన్నారు.
దహెగాం, జూలై 2 : మండలంలోని చంద్రపల్లిలో శ్మశాన వాటికను జడ్పీటీసీ తాళ్లపల్లి శ్రీరామారావు శుక్రవారం ప్రారంభించారు. అదేవిధంగా గెర్రె, గిరివెల్లి గ్రామాల్లో మొక్కలు నాటా రు. రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంభగౌని సంతోష్ గౌడ్, సర్పంచ్లు లగ్గాం మధుకర్, రాజన్న, రమేశ్, ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, ఎంపీవో రాజేశ్వర్ గౌడ్, ఏపీవో చంద్రయ్య పాల్గొన్నారు.
జైనూర్, జూన్ 2: మండలంలోని ఆశపల్లి రామునాయక్ తం డాను నీటి పారుదల శాఖ ఈఈ (గ్రామపంచాయతీ ప్రత్యే కాధికారి) జాదవ్ గుణవంత్ సందర్శించారు. శ్మశాన వాటిక, డంప్యార్డులను పరిశీలించారు. ప్రకృతి వనంలో మొక్కలను పరిశీలించారు. సర్పంచ్ రాథోడ్ సవిత, కార్యదర్శి తిరుపతి, గ్రామస్తులు ఉన్నారు.
చింతలమానేపల్లి, జూలై 2 : మండలంలోని లంబడీహెట్టి, బాబాపూర్ గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్క లు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ డుబ్బుల నానయ్య, జడ్పీటీసీ డుబ్బుల శ్రీదేవి, ఇన్చార్జి ఎంపీడీవో సుధాకర్రెడ్డి, మాజీ ఎంపీపీ డుబ్బుల వెంకయ్య, సర్పంచ్, కార్యదర్శులు పాల్గొన్నారు.