నాలుగెకరాలు అందించిన పురాణం సతీశ్కుమార్
ఎంపీపీ, సర్పంచ్ ద్వారా యజమానికి రూ. 6 లక్షలు అందజేత
కోటపల్లి, ఏప్రిల్ 30 : మండలకేంద్రంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీశ్ నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేసి ప్రభుత్వానికి అందజేశారు. గతంలోనే తెలంగాణ ప్రభుత్వం మండలకేంద్రంలో 100 డబుల్ బెడ్రూంలు మంజూరు చేయగా అనువైన స్థలం లేక నిర్మాణంలో జాప్యం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ పురాణం కోటపల్లి మోడల్ స్కూల్ సమీపంలోని నాలుగు ఎకరాల భూమిని తనుగుల రాజలింగు వద్ద రూ.6 లక్షలకు కొనుగోలు చేశాడు. డబ్బులను భూ యజమానికి ఎంపీపీ మంత్రి సురేఖ, సర్పంచ్ రాగం రాజక్క, మండల నాయకులు మంత్రి రామయ్య, రాగం స్వామి, మల్లయ్య, రాళ్లబండి శ్రీనివాస్, వేముల రాజం, కాగితపు సుభాష్, కోమట్ల శ్రీకాంత్, గోనె మోహన్ రెడ్డి అందజేశారు.
సొంత ఊరి కోసం :పురాణం సతీశ్ కుమార్, ఎమ్మెల్సీ
పుట్టిన ఊరి రుణం తీర్చుకునేందుకు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేసి ప్రభుత్వానికి అప్పగించాను. కోటపల్లిలో ఫోర్లేన్ రోడ్లో ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఇచ్చేందుకు ప్రభుత్వం 100 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేసింది. త్వరలోనే నిర్మాణాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.