మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు
పలు మండలాల్లో ముస్లింలకు రంజాన్ కానుకల పంపిణీ
దండేపల్లి,మే 4: మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. మండలకేంద్రంలోని తహసీల్ కార్యాలయ ఆవరణలో ముస్లింలకు రం జాన్ కానుకలను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్ర భుత్వం అన్ని వర్గాల పండుగలకు ప్రాధాన్యత ఇస్తున్నాదన్నారు. గతంలో ప్రభుత్వం ఆధ్వర్యం లో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశామని, ప్రస్తు తం కరోనా కారణంగా నిర్వహించలేని పరిస్థితి ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, తహసీల్దార్ హన్మంతరావు, పీఏసీఎస్ చైర్మన్లు కాసనగొట్టు లింగన్న, బెడద సురేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేని శ్రీనివాస్, స్థానిక ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు బండారి మల్లేశ్, గోళ్ల రాజమల్లు, అఫ్సర్బేగ్, గొట్ల భూమన్న, అలీ, తదితరులు ఉన్నారు.
మంచిర్యాలటౌన్, మే 4: పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్హాలులో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు కానకలు అందజేశారు. మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, కౌన్సిలర్ మినాజోద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
హాజీపూర్, మే 4 : మండలంలోని 17 గ్రామ పం చాయతీల్లోని ముస్లింలకు ఎమ్మెల్యే దివాకర్రావు రంజాన్ తోఫాలను అందజేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వ ర్గాల ప్రజలను ఆదరిస్తున్నారని తెలిపారు. రైస్ మి ల్లులకు ధాన్యాన్ని తీసుకెళ్తున్న లారీలను వెనువెంటనే అన్లోడ్ జరిగేలా చూడాలని తహసీల్దార్కు సూచించారు. మండలంలో 79 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులు మంజూరయ్యాయని, అధికారులు లబ్ధిదారుల ఇంటికి నేరుగా వెళ్లి చెక్కుల ను ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో హాజీపూర్ త హసీల్దార్ వాసంతి, మంచిర్యాల వ్యవసాయ మా ర్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు మొగిళి శ్రీనివాస్, మండల రైతు బంధు సమితి కన్వీనర్ పూస్కూరి శ్రీనివాస్ రా వు, మా జీ వైస్ ఎంపీపీ మందపెల్లి శ్రీనివాస్, యువత అ ధ్యక్షుడు దొమ్మటి బాపు, రాపల్లి స ర్పంచ్ మల్లేశ్, మండల కో-ఆప్షన్ సభ్యుడు రఫీ క్, నాయకులు బేతు రవి, లగిశెట్టి రాజయ్య, మ ట్టపల్లి సత్యనారాయణ రావు, ముస్లింలు పాల్గొన్నారు.
విశాంత్రి భవనంలో..
లక్షెట్టిపేట రూరల్, మే 4 : స్థానిక విశ్రాంతి భవనంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ముస్లింలకు రంజాన్ కానుకలను అందజేశారు. అనంతరం సూరారంలో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల, మతాలకు అతీతంగా బడుగు, బలహీన వర్గాల కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణ సర్కారు మాత్రమే అమలు చేస్తున్నాదని కొనియాడారు. అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పరితపిస్తుంటే కొందరు గిట్టని వారు తమపై అవాకులు, చెవాకులు పేలుతున్నారని, వారి మాటలను ప్రజలు నమ్మవద్దని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న, వైస్ ఎంపీపీ పెయ్యాల దేవెందర్ రెడ్డి, తహసీల్దార్ వేముల రాజ్ కుమార్, ఎంపీడీవో, సత్యనారాయణ, పీఆర్ డీఈ హరీశ్, ఏఈ శృతి, ఎంపీటీసీలు కల్లు డేవిడ్, గడుసు స్వప్న, రమేశ్, కౌన్సిలర్లు చాతరాజు రాజన్న, ఓరగంటి శ్రీకాంత్, లావుఢ్యా సురేశ్ నాయక్, సూరారం సర్పంచ్ మంచికంట్ల శంకరయ్య, నాగిరెడ్డి సంతోష్, బిల్ల అనిల్, సాగి ప్రభాకర్ రావు, పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
నస్పూర్లో ..
సీసీసీ నస్పూర్, మే 4: సీసీసీ ఆఫీసర్స్ క్లబ్లో ఎమ్మెల్యే దివాకర్రావు ముస్లింలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 10 మసీదులకు సంబంధించిన 300 మందికి కానుకలు అందజేశామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, తహసీల్దార్ జోష్య్న, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు వంగ తిరుపతి, కోఆప్షన్ సభ్యుడు నాసర్, కౌన్సిలర్లు జబిన్హైమద్, బోయ మల్లయ్య, పూదరి కుమార్, మార్కె ట్ కమిటీ డైరెక్టర్ గర్శె భీమయ్య, ఆయా మసీదు కమిటీల అధ్యక్షులు పాల్గొన్నారు.