జైనూర్ : కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా జైనురు మండలం సర్పంచుల సంఘం ( Sarpanchs Association ) మండల అధ్యక్షుడిగా బీఆర్ఎస్ నాయకుడు కోడప ప్రకాష్( Kodapa Prakash ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలోని 26 గ్రామపంచాయతీలకు చెందిన సర్పంచులు సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సమావేశమై అధ్యక్షుడిని ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచుల సమస్యల కోసం జిల్లాలోనే కాకుండా రాష్ట్రస్థాయిలోను పోరాటాలు చేసి పరిష్కరిస్తామని వెల్లడించారు. తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సర్పంచులకు ధన్యవాదాలు తెలిపారు.