ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 1 : గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడాకారులు జిల్లాస్థాయి ఎంపిక పోటీల్లో తమ ప్రతిభ చాటాలని గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాంతారావ్ సూచించారు. జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఆదిలాబాద్ గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో శుక్రవారం అండర్-17 బాలబాలికల ఖోఖో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు శుక్రవారం ఉత్సాహంగా సాగాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 250 మంది క్రీడాకారులు హాజరయ్యారు.
ప్రిన్సిపాల్ ఆగస్టీన్తో కలిసి గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాంతారావ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంపిక పోటీలు పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని, ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ఫణీందర్, కో-ఆర్డినేటర్ మారుతి, శర్మ, గురుకులం స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్, పెటా ప్రధాన కార్యదర్శి స్వామి, వ్యా యామ ఉపాధ్యాయులు మహేశ్, జయశ్రీ, రా ము, ప్రతాప్ సింగ్ సత్యనారాయణ, కోచ్లు రంజిత్, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.