దస్తురాబాద్, డిసెంబర్ 2 : దళిత బంధు పథకం దేశానికే తలమానికమమని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం ఆకొండపేట, దస్తురాబాద్, మున్యాల, బుట్టపూర్, గొడిసేర్యాల గ్రామాల్లో శుక్రవారం ఆమె పర్యటించారు. దళిత బంధు పథకంపై దళిత కుటుంబాలకు అవగాహన కల్పించారు. గొడిసేర్యాల ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలో పలు గ్రామాలకు చెందిన 16 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు.
అక్కడే ఐకేపీకి మంజూరైన ట్రాక్టర్ను ఆమె ప్రారంభించారు. ఎంపీపీ సింగరి కిషన్, వైస్ ఎంపీపీ భూక్యా రాజు నాయక్, ఎంపీటీసీలు, సర్పంచ్లు నిమ్మతోట రాజమణి, నిరోష, శంకర్, రాజలింగం, ప్రభాకర్, భూమేశ్, ఆత్మ కమిటీ వైస్చైర్మన్ రాజు, తహసీల్దార్ లక్ష్మి, ఏపీఎం గంగాధర్, ఆర్ఐలు గంగన్న, పీవీ నర్సయ్య, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు ఐలయ్య యాదవ్, జయలక్ష్మి, నాయకులు శ్రీనివాస్, శివయ్య, లక్ష్మిరాజం, సత్తన్న, సత్తన్న, రాజకుమార్ పాల్గొన్నారు.