‘కులవృత్తులకు ప్రాణం పోయడానికే సీఎం కేసీఆర్ ఆర్థిక భరోసా ఇస్తున్నారని, బీసీలకు రూ. లక్ష సాయం అనేది నిరంతరంగా కొనసాగుతోందని’ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. జడ్పీ సమా వేశ మందిరంలో గురువారం ఆదిలాబాద్ రూరల్, జైనథ్, బేల, మావల మండలాలకు చెందిన 300 మంది లబ్ధిదారులకు రూ.3 కోట్ల విలువైన చెక్కు లు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ.. సర్వే సరిగ్గా చేయకపోవ డంతో ఇబ్బంది అవుతున్నదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే రూ.లక్షలో రూ.20 వేలు తీసుకుంటే ధనవంతులు కారని, లబ్ధిదారులను ఎవరూ డబ్బులు అడగొద్దని సూచించారు. సాయంలో కొన్ని మార్పులు ఉన్నాయని వాటిని మంత్రి హరీశ్రావు, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
కుల వృత్తులకు కేసీఆర్ అండ
జడ్పీ సమావేశ మందిరంలో ఆదిలాబాద్ రూరల్, జైనథ్, బేల, మావల మండలాలకు చెందిన 300 మంది లబ్ధిదారులకు లక్ష సాయం చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కులవృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటూ ప్రోత్సాహం అందిస్తున్నదన్నారు. ఈ పథకం నిరంతర ప్రక్రియ అని, జిల్లాలో అర్హులైనందరికీ అందిస్తామని స్పష్టం చేశారు. 997 మంది నాయీబ్రాహ్మణులకు, 662 మంది రజకులకు ప్రతి నెలా 240 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు వెల్లడించారు. 37 కులలను ఎంబీసీలో చెర్పించి, ప్రత్యేకంగా వారి కోసం రూ.వెయ్యి కోటుల కేటాయించామన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో బీసీలకు రూ.1700 కోట్ల బడ్జెట్ ఉంటే, ప్రత్యేక రాష్ట్రంలో రూ.5200 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని 60 శాతం బీసీల సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. కాగా, కులవృత్థుల కుటుంబాల ఆర్థిక అభివృద్ధి కోసం అమలు చేస్తున్న ఈ పథకానికి సంబంధించి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు సర్వే సరిగా చేయలేదని విమర్శించారు. లేకపోతే అనర్హులను ఎలా ఎంపిక చేశారని వారిపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డీబీసీడీవో రాజాలింగం, జడ్పీటీసీలు నల్లవనిత, అక్షితాపవర్, తుమ్మల అరుంధతి, ఎంపీపీలు గోవర్ధన్, గండ్రత్ రమేశ్, వనిత, మున్సిపల్ కమిషనర్ శైలజ, ఏఎంసీ చైర్మన్ కుమ్ర లక్ష్మీరాజు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు కౌన్సిలర్లు, ఎంపీడీవో, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.