వెలుగు వెలిగిన బ్రాహ్మణ సమాజం ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. ఫలితంగా వేదాలు ఘోషించిన చోట పేదరికంతో అల్లాడుతున్న అర్చకుల సంఖ్య పెరిగింది. దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాలు సమర్పించిన బ్రాహ్మణుల ప్రాధాన్యత కూడా తగ్గిపోయింది. పురాతన దివ్యక్షేత్రాలు శిథిలమైపోతున్నా.. గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. అర్చకత్వానికి ఆలయాలు కరువై బతుకుదెరువు కోల్పోతున్న బ్రాహ్మణులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు నడుం బిగించారు. హిందూ ధర్మ పరిరక్షణకు చర్యలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానంతరం ధూప, దీప, నైవేద్యాల ఖర్చులు, అర్చకులు, వేదశాస్త్ర పండితులకు గౌరవ భృతి ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుతం భృతి పెంచారు. చరిత్రలో చూసిన సత్యాన్ని ప్రస్తుతం ప్రత్యక్షంగా చూస్తున్నామని, బ్రాహ్మనోత్తములకు గతంలో రాజులు, చక్రవర్తులు ఇచ్చిన ప్రాధాన్యతను ఇప్పుడు సీఎం కేసీఆర్ ఇస్తున్నాడని అర్చకులు, బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని దీవిస్తున్నారు.
– ఆదిలాబాద్, జూన్ 1(నమస్తే తెలంగాణ)
‘బ్రహ్మజ్ఞాన వాంస్తు.. బ్రాహ్మణః’ అని మన పెద్దలు చెప్పారు. బ్రహ్మజ్ఞానం పొందిన వారెవరికైనా బ్రాహ్మణత్వం సిద్ధిస్తుంది. వేదవాఙ్మయ విజ్ఞానాన్ని విపులంగా లోకానికి అందించేవారే విప్రులు. సర్వజనహితం, సర్వజన సుఖం బ్రాహ్మణుల లక్ష్యం. పురం యొక్క హితం కోరేవారే పురోహితులు. ‘లోకా స్సమస్తా.. సుఖినో భవంతు’ అన్నది బ్రాహ్మణుల నోట పలికే జీవనాదర్శం. బ్రాహ్మణుల మనసు, మాట, శరీరం, చేసే పని లోకహితం కోసమే. పేదరికం ఎవరి జీవితంలో ఉన్నా వారిని ఆదుకోవాలనే మానవీయ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది.
– విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్.
సనాతన ధర్మ పరిరక్షణకు కృషి..
బాసర, జూన్, 1 : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దేశంలోనే నంబర్వన్ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్. సనాతన ధర్మం కోసం కృషి చేస్తున్న ఏకైక వ్యక్తి ఆయనే. ఎన్నో యాగాలు చేసిన మహానుభావుడు. బ్రాహ్మణుల బాగు కోరి అనేక పథ కాలు అమలు చేస్తున్నారు. పేద పిల్లల చదువులకు స్కాలర్ షిప్స్, ధూప,దీప, నైవేద్యం, బ్రాహ్మణ పరిషత్కు నిధులువంటి ఎన్నో గొప్ప పనులు చేస్తున్నారు.
– అచ్యుత్ మహారాజ్ , ఉప ప్రధాన అర్చకుడు, బాసర దేవస్థానం
సబ్బండ వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ హిందూ ధర్మ పరిరక్షణకు చర్యలు చేపట్టారు. ధూప, దీప, నైవేద్యాలకు రూ.2 వేలు, అర్చకులకు రూ.4 వేల చొప్పున 2015 జనవరి 9 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. తాజాగా ఈ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతూ సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేద పండితుల గౌరవ వేతనాన్ని రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచారు. ఇప్పటివరకు 75 ఏండ్లు ఉన్న వారికే ఈ గౌరవ వేతనం వర్తించేది. ఇప్పుడు వయో పరిమితిని 65 ఏండ్లకు తగ్గించారు. గతంలో వేద పాఠశాలలకు స్థాయిని బట్టి రూ.50 వేలు, రూ.75 వేలు, రూ. లక్ష చొప్పున ఇచ్చేవారు. ఇప్పుడు ప్రతి వేద పాఠశాలకు ఏటా రూ.2 లక్షలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని కూడా అర్చకులు స్వాగతిస్తున్నారు. దేవాలయాల వద్ద దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణ ఎంపవర్మెంట్ స్కీం కింద గరిష్ఠంగా రూ. 5 లక్షల గ్రాంట్ అందిస్తోంది. ఈ రకంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక మందికి ఉపాధి లభిస్తోంది. బ్రాహ్మణులు సొంతంగా వాహనాలు కొనుగోలు చేసుకుంటే సబ్సిడీని అందిస్తోంది. బ్రాహ్మణుల పిల్లలు చదువుకునేందుకు విద్యా రుణాలు ఇస్తోంది. విదేశాల్లో చదువుకునేందుకు ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ ఇస్తోంది. బ్రాహ్మణ విద్యార్థుల కోసం సీఎం కేసీఆర్ తాజాగా మరో వరాన్ని ప్రకటించారు. ఐఐఎం, ఐఐటీల్లో చదివే విద్యార్థులకు ఫీజ్రీఎంబార్స్మెంట్ పథకాన్ని ప్రకటించారు. దీని వల్ల ఉన్నత చదువులు చదవాలనుకునే పేద బ్రాహ్మణుల పిల్లలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
-ఆదిలాబాద్, జూన్ 1(నమస్తే తెలంగాణ)
బ్రాహ్మణ సమాజం గుండెల్లో పెట్టుకుంటుంది
బాసర, జూన్ 1 : హైదరాబాద్ శివారులోని గోపనపల్లిలో విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఇది తెలంగాణ బ్రాహ్మణుల ఆత్మగౌరవానికి చిహ్నంగా నిలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దేవస్థానాల్లో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న అర్చకుల సమస్యలను మంత్రివర్గంతో చర్చించి పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అందరికంటే గొప్ప హిందూ ధర్మ పరిరక్షకుడు సీఎం కేసీఆర్ అని చెప్పక తప్పదు. యావత్ బ్రాహ్మణ సమాజం సీఎం కేసీఆర్ను గుండెల్లో పెట్టుకుంటుంది. ఇతర రాష్ట్ర బ్రాహ్మణులు కూడా సీ సీఎం కేసీఆర్ చేస్తున్న పనులను చూసి ఆనందపడుతున్నారు. ఇలాంటి గొప్ప నాయకుడు మాకు కూడా ఉంటే బాగుండునని అంటున్నారు. – పూజారి సంజీవ్ కుమార్, ప్రధానార్చకుడు, శ్రీ జ్ఞాన సరస్వతీ దేవస్థానం, బాసర
వేద పండితులు, అర్చకులకు ప్రయోజనం
విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు వేదపండితులు, అర్చకులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. వయస్సు పై బడిన పూజాది కార్యక్రమాలు నిర్వహించలేకపోతున్న వేద పండితుల గౌరవభృతిని రూ. 5 వేలకు పెంచడం హర్షనీయం. పౌరోహిత్యంపై ఆధారపడిన కుటుంబాలకు ప్రభుత్వం తరపున పలు ఉపయుక్తమైన ప్రకటనలు చేయడం సంతోషకరం. దూప, దీప నైవేద్య అర్చకులు జీతభత్యాలను అవసరాలకు అనుగుణంగా పెంచడం, ఈ పథకం పరిధిలోకి మరిన్ని దేవాలయాలను చేర్చడం వల్ల మరికొంత మందికి ఉపాధి లభిస్తుంది. వేద పండితుల పింఛన్ వయసును 65 సంవత్సరాలకు తగ్గించడం, వేద పాఠశాలలకు ఏడాదికి రూ. 2 లక్షల గ్రాంట్ ఇవ్వడం ఎంతో మంచిది. ముఖ్యమంత్రి కేసీఆర్కు భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.
– చికిలి వెంకటేశ్వర సిద్ధాంతి, గౌరవ అధ్యక్షుడు, వైదిక, పురోహిత అర్చక సంఘం, ఆదిలాబాద్
వేద పాఠశాలలకు రూ. 2 లక్షల గ్రాంట్ హర్షనీయం
తెలంగాణలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. యాదగిరిగుట్ట ఆలయాన్ని భక్తిభావం పెంపొందించేలా తీర్చిదిద్దారు. కొండగట్టు, వేములవాడ, ధర్మపురిలాంటి ఆలయాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి చేస్తుంది. ధూప, దీప, నైవేద్య పథకాన్ని 2796 ఆలయాలకు విస్తరింప చేయడం, ఈ పథకం కింద ఆలయాల నిర్వహణ కోసం అర్చకులకు అందిస్తున్న మొత్తాన్ని రూ.10 వేలకు పెంచడం ఎంతో అభినందనీయం. వేద పాఠశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం ఇస్తున్న రూ. 2 లక్షల గ్రాంట్ను వార్షిక గ్రాంట్గా ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం ఎంతో సంతోషకరం. ఐఐఎం, ఐఐటీలాంటి ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపచేయడంతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసినట్లు అవుతుంది.
– ప్రవీణ్ శర్మ, వేద పండితులు, ఆదిలాబాద్
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక..
మంచిర్యాల ఏసీసీ, జూన్ 1 : తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ బ్రాహ్మణులు, అర్చకులకు ఎంతో మేలు చేశారు. బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసి, పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించారు. బ్రాహ్మణ పరిషత్ ద్వారా అనేక మంది యువకులకు ఉపాధి కల్పన, విదేశీ చదువుల కోసం స్కాలర్షిప్ అందజేయడం, లోన్లు ఇస్తున్నారు. మారుమూల గ్రామాల్లోని ఆలయాలకు దూపదీప నైవేద్యం కింద 2014 ముందు రూ.2500 మాత్రమే అందేవి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రూ.6500లకు పెంచారు. ఇప్పుడు మళ్లీ రూ.10 వేలకు పెంచారు. సీఎం కేసీఆర్ను ఆ భగవంతుడు చల్లగా చూడాలని, ఆయన మరెన్నో సంక్షేమ పథకాలు తీసుకరావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
– సంగనభట్ల నరహరి శర్మ, విశ్వనాథ ఆలయ ప్రధాన అర్చకుడు
అర్చకుల జీవితాల్లో మార్పులు
దండేపల్లి, జూన్1 : తెలంగాణ వచ్చాక అర్చకుల జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. సీఎం కేసీఆర్ అర్చకుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతు న్నారు. గౌరవ భృతితో పాటు అర్హత వయస్సు కూడా 75 యేండ్ల నుంచి 65 యేండ్లకు తగ్గిస్తు న్నట్లు ప్రకటించారు. ఇందుకు చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలో ఉన్న 6441 ఆలయాలకు ధూప, దీప, నైవేద్యం కింద నిర్వహణ వ్యయం అందజేయడం కూడా మాలాంటి వారికి శుభవార్తనే. సర్వ మతాలను సమాన దృష్టితో చూస్తున్న ముఖ్యమంత్రికి ఎవరూ సాటిరారు. అనువంశిక అర్చకుల సమస్యలపై క్యాబినెట్లో చర్చిస్తామని ప్రకటించడం కూడా గొప్ప విషయం. వంశపారంపర్య అర్చకులు జీవితాంతం కేసీఆర్కు రుణపడి ఉంటారు. – గోవర్ధన రఘుస్వామి, ప్రధాన అర్చకుడు, గూడెం దేవస్థానం
అర్చకుల జీవితాలను మార్చిన ఘనత కేసీఆర్దే
మంచిర్యాల ఏసీసీ, జూన్ 1 : తెలంగాణ ఏర్పడిన తర్వాత అర్చకుల జీవితాలు మారిపోయాయి. బ్రాహ్మణ వ్యవస్థలో మార్పు తీసుకవచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే. ఈ పదేళ్లలో అర్చకులను ఎంతో ఆదుకున్నారు. అర్చకుల జీతం, దూపదీప నైవేద్య జీతభత్యాలను పెంచి వారి కుటుం బాలకు భరోసానిస్తున్నారు. దేశంలోనే తెలంగాణకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకవచ్చారు. వారు మరెన్నో సంక్షేమ పథకాలను తీసుకరావాలని కోరుకుంటున్నాను.
– గోవర్ధనా భట్టాచార్యులు, విశ్వనాథ స్వామి ప్రధాన అర్చకుడు
దేశంలో ఎక్కడా లేని విధంగా బ్రాహ్మణ సదనం
తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలో విప్రహిత బ్రాహ్మణ సదనం నిర్మించింది. గ్రామాల్లో ఆలయాలను అభివృద్ధి చేస్తూ ప్రజల్లో భక్తిభావం పెంపొదించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఖర్చులు పెరిగిన పరిస్థితులు ధృష్ట్యా ధూప, దీప, నైవేద్యాల మొత్తాన్ని రూ. 10 వేలకు పెంచడం ఎంతో సంతోషకరం. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు పేదల బ్రాహ్మణులకు, వేద పండితులు, విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతాయి. – రాధాకృష్ణ శాస్త్రి, అర్చక సంఘం, కోశాధికారి, ఆదిలాబాద్ జిల్లా
సీఎం కేసీఆర్కు భగవంతుడి ఆశీస్సులుంటాయి
దండేపల్లి, జూన్1 : సర్వహిత సంక్షేమ మే ధ్యేయంగా ముందుకు సాగు తున్న సీఎం కేసీఆర్కు ఆ భగవం తుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటా యి. గతంలో ఉన్న ప్రభుత్వాలతో పోల్చుకుంటే తెలంగాణ వచ్చాక అర్చకుల జీవితాల్లో అనేక మార్పులు వచ్చాయి.ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే అర్చకులకు వేతనాలు అందించడం చాలా సంతోషించాల్సిన విషయం. ధూప, దీప, నైవేద్యం కింద అర్చకులకు మొదట్లో రూ.2500 ఇచ్చేవాళ్లు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రూ.6 వేలకు పెంచారు. ఇప్పుడు రూ. 10 వేలకు పెంచుతామని సీఎం ప్రకటించారు. ఈ పథకాన్ని మరో 2796 దేవాలయా లకు పెంచడంతో చాలా మంది అర్చకులకు లబ్ధి చేకూరను న్నది. అనువంశిక అర్చకుల సమస్యలపై క్యాబినెట్లో చర్చిస్తామని ప్రకటించడం గొప్ప విషయం. వంశపారంపర్య అర్చకులు జీవితాంతం కేసీఆర్కు రుణపడి ఉంటారు. గత ప్రభుత్వాలకు ఎన్నోసార్లు విన్నవించకున్నా పట్టించుకోలేదు. కానీ సీఎం స్వయంగా ప్రకటన చేయడంతో మాకు ఎంతో నమ్మకం కలిగింది. – గోవర్ధన సంపత్స్వామి, వంశ పారంపర్యక అర్చకుడు, గూడెం దేవస్థానం
బ్రాహ్మణుల కోసం అనేక పథకాలు
బాసర, జూన్ 1 : గోపనపల్లిలో నిర్మించిన విప్రహిత బ్రహ్మసదనం ప్రతి బ్రాహ్మణుడి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది. బ్రాహ్మణుల్లోనూ పేదవారు ఉన్నారని గుర్తించి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. తెలంగాణ బ్రహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేసి అర్హులైన వారందరికీ రూ. 5 లక్షల వరకు 100 శాతం సబ్సిడీపై రుణాలు అందిస్తున్నది. బ్రాహ్మణ పేద విద్యార్థులకు విదేశీ స్కాలర్ షిప్ ఇస్తున్నది. వేద పాఠశాల నిర్వహణకు సంవత్సరానికి రూ. 2 లక్షలు గ్రాంట్ మంజూరు చేసింది. వృద్ధ వేద పండితులకు నెలకు రూ. 5 వేలకు పెంచింది. ఇలా ఎన్నెన్నో పథకాలు అమలు చేస్తున్నది. బ్రాహ్మణులపై సీఎం కేసీఆర్కు ఉన్న గౌరవానికి ఇది నిదర్శనం. మన ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టం. మన తెలంగాణ అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలువాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం.
– కందికోట నవీన్ శర్మ, సామ వేద పండితుడు,శ్రీ జ్ఞాన సరస్వతీ దేవస్థానం, బాసర
పది కాలాల పాటు పచ్చగా ఉండాలి
ప్రభుత్వం ఆలయాలకు ఇస్తున్న ధూప దీప నైవేద్య పథకం డబ్బులతో పాటు అర్చకుల గౌరవ భృతిని పెంచు తున్నట్లు ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రభు త్వం మాకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ. 2500 నుంచి ఒక్కసారిగా రూ. 5000కు పెంచడం గొప్ప విషయం. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. ప్రభు త్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ధర్మపరిరక్షణ జరుగు తుంది. నిత్యం ఆలయాల్లో పూజలు, దేవతలకు నైవేద్యాల సమర్పణ సక్రమంగా జరుగుతుంది. ఈ ప్రభుత్వం పది కాలాల పాటు పచ్చగా ఉండాలి.
– ఒజ్జల శిరీష్ శర్మ, కేస్లాపూర్ (ఆసిఫాబాద్)