ఇచ్చోడ, మార్చి 10 : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) గ్రామంలో బాలింత కోమల్కు మంగళవారం మాజీ సర్పంచ్ మీనాక్షి కేసీఆర్ కిట్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్ ఇవ్వడం లేదన్నారు.
కానీ.. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా బాలింత కోమల్కు కేసీఆర్ కిట్ అందించామన్నారు. అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్పై కోపంతో కేసీఆర్ కిట్లను పూర్తిగా నిలిపివేసిందన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బాలింతలు కేసీఆర్ కిట్ దూరమవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.