ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, ఏప్రిల్ 12 : సుప్రీం కోర్టు సూచనల మేరకు రాబోయే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని జైళ్లను ఉన్నతీకరించనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.వీ. రమేశ్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో కమిటీ సభ్యులతో రెండో రోజూ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న జైళ్లను విస్తరించడం, ఉన్నతీకరించడం జరుగుతుందని, వాటిలో సౌకర్యాల కల్పనకు నివేదిక రూపొందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జే అనంతలక్ష్మి, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణు, అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు, ప్రత్యేక ఉపకారాగారం సూపరింటెండెంట్ ప్రేమ్కుమార్, ఎస్ఐ సతీష్ పాల్గొన్నారు.