ఎదులాపురం, మార్చి 10 : యువత భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని ఎకడ ఉద్యోగం వచ్చిన యువత చేజార్చుకోవద్దని, వచ్చిన ఉద్యోగాన్ని చకగా నిర్వర్తించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో పొలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. దాదాపు 7500 మంది నిరుద్యోగ యువతీయువకులు జాబ్ మేళాకు హాజరు కావడంతో పరేడ్ మైదానం కికిరిసింది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచే కాకుండా వివిధ మండలాల నుండి భారీ సంఖ్యలో హాజరు కాగా.. కంపెనీలవారీగా కౌంటర్లను ఏర్పాటు చేసి టోకెన్లు ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జాబ్మేళాలో పాల్గొన్న సుమారు 2100 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు పటేల్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, అదనపు ఎస్పీ మౌనిక, ఏఎస్పీ సురేందర్రావు పాల్గొన్నారు.