శ్రీరాంపూర్, ఫిబ్రవరి 9 : నస్పూర్ మున్సిపాలిటీలో పాలకవర్గ ఎన్నిక శుక్రవారం జడ్పీ సీఈవో కే నరేందర్ ఆధ్వర్యంలో జరిగింది. సమావేశంలో మొత్తం 25 మంది కౌన్సిలర్లకుగాను 18 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఏడుగురు, కాంగ్రెస్ కౌన్సిలర్ ఒకరు గైర్హాజరయ్యారు. ఎక్స్ అఫీషియే సభ్యుడిగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న కౌన్సిలర్ బొద్దున సంధ్యారాణీ చైర్మన్గా సుర్మిల్ల వేణు పేరును ప్రతిపాదించగా, సీపతి సుమతి బలపరిచారు.
వైస్ చైర్మన్గా గెల్లు రజిత పేరును కౌన్సిలర్ బండారి సంధ్యారాణి ప్రతిపాదించగా, సీపతి సుమతి బలపరిచారు. ఇంకా ఎవరూ పోటీకి రాక పోవడంతో కౌన్సిల్ ఆమోదం మేరకు నస్పూర్ మున్సిపల్ చైర్మన్గా సుర్మిల్ల వేణు(కాంగ్రెస్), వైస్ చైర్మన్గా గెల్లు రజిత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల ఆధికారి, జడ్పీ సీఈవో కే నరేందర్ ప్రకటించారు. ఆనంతరం వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు హాజరై చైర్మన్గా ఎన్నికైన సుర్మిల్ల వేణు, వైస్ చైర్మన్గా ఎన్నికై గెల్లు రజితలను సన్మానించారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బండారి సుధాకర్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు నస్పూర్ మున్సిపల్ కార్యాలయం నుంచి సీసీసీ కార్నర్ వరకు పటాకులు కాల్చుతూ విజయోత్సవ ర్యాలీ తీశారు. అంబేద్కర్, రాజీవ్గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అగల్డూటి రాజు, మేకల దాసు, ఆర్ చంద్రశేఖర్, కోడూరి లహరి, తెనుగు లావణ్య, బండి పద్మ, మల్లయ్య, మర్రి మొగిళి, బెడిక లక్షి, మహేశ్, కుమార్, బౌతు లక్షి, తోట శ్రీనివాస్, ఇన్చార్జి కమిషనర్ సతీష్ పాల్గొన్నారు.