బాసర, ఆగస్టు 9 : నిజామాబాద్ ఐటీ హబ్లో బాసర ట్రిపుల్ఐటీ ఇన్నోవేషన్ సెంటర్ను బుధవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నిజామాబాద్లోని బైపాస్ రోడ్డులో ఉన్న ఐటీ టవర్లో ప్రత్యేకంగా బాసర ట్రిపుల్ఐటీకి కేటాయించిన ఇన్నోవేషన్ సెంటర్ను ఇన్చార్జి వీసీ వెంకటరమణ, మంత్రి ప్రశాంత్రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాతో కలిసి బుధవారం ఉదయం ప్రారంభించారు. అనంతరం ట్రిపుల్ఐటీ విద్యార్థులు ఏర్పాటు చేసిన పలు ప్రయోగాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ప్రయోగాల వివరాలను అడిగి తెలుసు కున్నారు. ఐటీ హబ్లో బాసర ట్రిపుల్ఐటీ సెంటర్ను ఏర్పాటు చేశామని, దీనిని విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. అధునాతన టెక్నాలజీని సద్వినియోగం చేసుకొని ప్రదర్శనల ను తయారు చేయాలని సూచించారు.
ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న పలువు రు విద్యార్థులకు ల్యాప్టాప్లను అందజేశా రు. అంతకుముందు ఐటీహబ్లోని సరస్వతీ అమ్మవారికి పూజలు చేశారు.. రాష్ట్ర ప్రభుత్వం బాసర ట్రిపుల్ఐటీకి అన్నిరకాల సహాయ సహాకారాలు అందిస్తుందని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అధికారులకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. ప్రస్తుత కాలంలో భావి తరాలకు ఐటీ మా ర్గదర్శకంగా నిలుస్తుందని, బాసర ట్రిపుల్ఐటీలో ని అన్ని సదుపాయాలను ఉపయోగించుకొని మంచి భవిష్యత్తు రూపొందించుకొని ఉద్యోగాలు సాధించి, తల్లిదండ్రులకు అండగా నిలవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి వీసీ వెంకటరమణతో పాటు అసోసియే ట్ డీన్ సృజన, కంప్యూటర్ సైన్స్ హెచ్వోడీ సు జోయ్, సీవోఈ వినోద్, ప్లేస్మెంట్ ఆఫీసర్ హరిబాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రవికాంత్, రాకేష్శ్ రెడ్డి, రంజిత్, సారిక, సృజన, విద్యార్థులు, తదిత రులు పాల్గొన్నారు.