ఇంద్రవెల్లి, డిసెంబర్ 3 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా ఆలయ ప్రారంభోత్సవ ఏర్పాట్ల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆలయం ముందు శనివారం ధ్వజ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలతో పాటు వేరింగ్, ఇతర నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఆలయంలో ప్రత్యేకమైన బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రారంభోత్సవానికి వచ్చే భక్తులు, ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు మెస్రం వంశీయులు చర్యలు తీసుకుంటున్నారు. కార్యక్రమంలో మెస్రం వంశీయులు, తదితరులు పాల్గొన్నారు.
నాగోబా ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం
ఇంద్రవెల్లి, డిసెంబర్ 3 : కేస్లాపూర్లో నాగోబా ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని జిల్లాలోని ప్రముఖులను శనివారం మెస్రం వంశీయులు మర్యాద పుర్వకంగా కలిసి ఆహ్వానించారు. కలెక్టర్ సిక్తాపట్నాయక్తో పాటు జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నను కలిసి నాగోబా ఆలయ ప్రారంభోత్సవానికి చెందిన ప్రచార పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్ మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు నాగోబా ఆలయ ప్రారంభోత్సవ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఆలయంలో నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపన, కలశ పూజ, ధ్వజారోహణం, హోమం ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ప్రముఖులను కలిసి ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మెస్రం వంశీయులు చిన్నుపటేల్, బాదిరావ్పటేల్, సోనేరావ్, దేవ్రావ్, తుకారాం, శేఖర్బాబు, ఆనంద్రావ్, కోసేరావ్, తదితరులు పాల్గొన్నారు.