బాసర, జనవరి 3 : బాసర సరస్వతీ అమ్మవారిపై రెంజర్ల రాజేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బాసర భగ్గుమంది. మంగళవారం వ్యాపారులు, గ్రామస్తులు, ఆలయ అర్చకులు, కుల మతాలకు అతీతంగా రాజకీయ నాయకులు బంద్లో స్వచ్ఛం దంగా పాల్గొన్నారు. ఆలయ ఆవరణ, రైల్వేస్టేషన్ వద్ద ధర్నా, రాస్తారోకోలు నిర్వహించారు. నిజామాబాద్- భైంసా రహదారి శివాజీ విగ్రహం వద్ద వాహనాలను అడ్డుకొని నిరసన తెలిపారు.
24 గంటల్లో రాజేశ్పై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసి, శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. రాజేశ్పై ఐపీసీ 153, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.