ఆదిలాబాద్ రూరల్, జనవరి 9 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఏజీఎం) ధనుంజయులు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. రైల్వే ఆస్పత్రి, క్వార్టర్స్ను సందర్శించారు. పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఏజీఎం మాట్లాడుతూ.. ప్రయాణికుల సౌకర్యార్థం మూడు లిఫ్ట్లతోపాటు ఫుట్వేర్ బ్రిడ్జి నిర్మిస్తామన్నారు. ఫిట్లైన్ పనులు వచ్చే మార్చి నాటికి పూర్తయితాయని, దీంతో మరిన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వస్తాయన్నారు.
సమస్యలు పరిష్కరించండి..
ఆదిలాబాద్ రైల్వేస్టేషన్కు మంగళవారం వచ్చిన దక్షిణ మధ్య రైల్వే ఏజీఎం ధనంజయులుకు వినతులు వెలువత్తాయి. ఈ మేరకు రైల్వే బోర్డు మెంబర్ రమణతోపాటు కాంగ్రెస్, బీజేపీ నేతలు, స్టేషన్కు అవతల వైపు ఉన్న కాలనీవాసులు ఏజీఎంను కలిసి వినతి పత్రాలు అందజేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం రైళ్ల సంఖ్య పెంచాలని, ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని విన్నవించారు. దీనికి ఏజీఎం సానుకూలంగా స్పందిస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.