కాసిపేట, జనవరి 6 : ముత్యంపల్లి జడ్పీ ఉన్న త పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి కళోత్సవ్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం వెంకటేశ్వరస్వామి తెలిపారు. శనివారం ఆయన మా ట్లాడుతూ ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో 9వ తరగతి విద్యార్థులు బిందుప్రియ, నరేందర్ ప్రథమ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు.
ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించే జాతీయ స్థాయి కళోత్సవ్ పోటీల్లో బిందుప్రియ తోలు బొమ్మల ఆటలతో పాటు బాలికల విద్య, జాతీయ సమైక్యత, ఓటు హక్కు, కరోనా జాగ్రత్తలపై ప్రదర్శన ఇవ్వనుండగా, నరేందర్ చిన్నయ్య సూరి పంచతంత్ర కథలోని పలు అంశాలపై చెక్క పొట్టు ఆధారంగా తయారు చేసిన బొమ్మలతో ప్రదర్శన ఇస్తాడన్నారు. గైడ్ టీచర్ శాంకరిని, డీఈవో యాదయ్య, ఎంఈవో ప్రభాకర్, హెచ్ఎం వెంకటేశ్వరస్వామి వారిని అభినందించారు. ఉపాధ్యాయులు పుష్పలత, పల్లె కృష్ణగోపాల్రావు, జ్యోతి, మాధవీలత పాల్గొన్నారు.