ఎదులాపురం,డిసెంబర్ 3: లోపాలను ఆయుధంగా మలుచుకుం టూ సవ్యాంగులతో సమానంగా దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే జోగు రామన్న పిలుపునిచ్చారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించారు. చిన్నారులతో ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు దివ్యాంగులను సత్కరించి మెమొంటోలు అందించారు. అనంతరం దివ్యాంగులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ… దివ్యాంగులకు మరింత సేవలను అందించేందుకు గాను దివ్యాంగుల శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందన్నారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించేలా త న వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. దివ్యాంగుల కో సం ప్రత్యేక ఫిర్యాదుల విభాగం నిర్వహించి ప్రాధాన్యతా క్రమం లో పరిష్కరిస్తున్నామని తెలిపారు. జిల్లా సంక్షేమాధికారి మి ల్కా, డీఆర్డీవో కిషన్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, వివిధ దివ్యాంగుల సంక్షేమ సంఘాల నాయకులు సలీం, నగేశ్ ఇమ్రాన్ పాల్గొన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం..
ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేరుస్తూ వా రి ఇబ్బందులను పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే జోగు రామ న్న స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని బొక్కలగూడలో రూ.50లక్షలతో నిర్మించనున్న డిజిటల్ నాన్ వెజ్ మార్కెట్ పనులను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను ప్రారంభించారు. అ నంతరం మాట్లాడుతూ పట్టణంలో అమలు చేస్తున్న అభివృద్ధి పనులను వివరిస్తూనే కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేను శాలువాతో ఘ నంగా సత్కరించారు. వైస్ చైర్మన్ జహీర్ రంజాని, టీఆర్ఎ స్ పట్టణాధ్యక్షుడు అలాల్ అజయ్, కార్యదర్శి ఆశ్రఫ్, టీఆర్ఎస్ మహిళా అధ్యక్ష,కార్యదర్శులు స్వరూప, బోడగం మమ త, పండ్ల శ్రీనివాస్, అత్తర్ఉల్లా, సాజిదోద్దీన్,సలీంపా షా, కోఆప్షన్ సభ్యులు ఏజాజ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యకే ప్రథమ ప్రాధాన్యం
ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 3: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లోహార గ్రామంలో మహారాష్ట్ర బ్యాంక్ అధికారి కాడే స్వామి తన సొంత ఖర్చులతో విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్వెటర్లు, పెన్నులు, పెన్సిళ్లు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మా ట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూనే మరోవైపు విస్తృతంగా సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం అభినందనీయమని కొనియా డారు. ఎంపీపీ గండ్రత్ రమేశ్, వైస్ ఎంపీపీ జంగు పటేల్, నాయకులు మెట్టు ప్రహ్లాద్, జగదీష్ పాల్గొన్నారు.