ఎదులాపురం, అక్టోబర్ 14 : బౌద్ధ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించాలని భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నజాడే ప్రజ్ఞాకుమార్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో శనివారం ధర్మ చక్ర ప్రవర్తన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రత్నజాడే ప్రజ్ఞా కుమార్తో పాటు బంతేజీలతో కలిసి అంబేద్కర్ విగ్రహం ముందు జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి బౌద్ధ వందనాన్ని సమర్పించారు. అలాగే కైలాస్నగర్లోని అశోక్ బుద్ధ విహార్లో పలు కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దయానంద్ కాంబ్లే, సభ కేంద్రియ శిక్షక్ యువరాజ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భీంరావ్ వాగ్మారే, దాదాసాహెబ్ జాబడే, ఉపాధ్యక్షురాలు కుష్వర్త లాండ్గే, కోశాధికారి కాంతారావు, కార్యదర్శి అమ్రపాలా, మాయవతి, ఉజ్వల, సుమన్, గణేశ్, రవీంద్ర, భగవాన్, దయానంద్, జనార్దన్, సూర్యవంశీ, తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లిలో..
ఇంద్రవెల్లి, అక్టోబర్ 14 : మండల కేంద్రంలోని బుద్ధనగర్, మిలింద్నగర్, ప్రభుద్ధనగర్, భీంనగర్, అంబేద్కర్ చౌక్లో దళితుల ఆధ్వర్యంలో ధర్మచక్ర పరివర్తన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం మండల కేంద్రంలోని అశోక, త్రిరత్న, పంచశీల, ధమ్మచక్ర బుద్ధ విహార్లో బౌద్ధ ఉపాసిక, ఉపాసకులు బుద్ధ, ధమ్మ, సంఘ వందన నిర్వహించారు. ముందుగా మండల కేంద్రంలోని బుద్ధవిహార్లో అంబేద్కర్, బుద్ధుడు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని పలువురు నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. బుద్ధవందన, ధమ్మవందన, సంఘవందన తీసుకున్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల కమిటీ గౌరవాధ్యక్షుడు కాంబ్లే మారుతి, ప్రధానకార్యదర్శి వాగ్మారే కామ్రాజ్, భారతీయ బౌద్ధ మహాసభ మండలాధ్యక్షుడు దుండే సంతోష్, భీం ఆర్మీ ఖానాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు పరత్వాగ్ దత్తా, బౌద్ధ ఉపాసకులు మస్కే రాజ్వర్ధన్, దిలీప్మోరే, పవార్ రామారావ్, ఆనంద్రావ్, భరత్, శివాజీ, సత్యానంద్, బాబాసాహెబ్, ఉత్తమ్కాంబ్లే, సులోచన, ప్రభావతి, దళితులు పాల్గొన్నారు.