ఉట్నూర్, మార్చి 6: ఉట్నూర్ డివిజన్ కేం ద్రంలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు తమని బూతులు తిట్టిందని వి ద్యార్థులు రోడ్డెక్కారు. శుక్రవారం కుమ్రం భీం ప్రాంగణంలోని డిగ్రీ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకురాలు ప్రత్యూష తమను బూతులు తిట్టిందని విద్యార్థులు కళాశాల ఎదుట రోడ్డుపై బైఠాయించారు. కొన్ని రోజులుగా అధ్యాపకురాలు తిడుతున్నా ప్రిన్సిపాల్ సైతం పట్టించుకోవడం లేదని అందుకే ఆందోళనకు దిగినట్లు విద్యార్థినులు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న గురుకుల ప్రాంతీయ కార్యదర్శి ఆగస్టియన్, ఎస్ఐ విజయ్, పీవీటీజీ ఏపీవో ఆత్రం భాస్కర్ వచ్చి విద్యార్థులను సముదాయించినా వినలేదు. అధ్యాపకురాలిని కళాశాల నుంచి పంపించే వరకు విరమించేది లేదని హెచ్చరించారు. ఐటీడీఏ పీ వో యువరాజ్కు ఫిర్యాదుచేసి బదిలీపై పంపిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. అయితే కొందరు విద్యార్థినుల వద్ద ఉన్న ఫోన్లను తీసుకొని అధ్యాపకురాలు పరిశీలించి, తిట్టినట్లు తెలిసింది.