ఎదులాపురం, అక్టోబర్ 4 : టీఎస్పీఎస్సీ గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శి హైదరాబాద్ నుంచి మంగళవారం కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడు తూ.. జిల్లాలో 19 సెంటర్లలో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని, 6200 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో గదిని బట్టి 24/36/48 మంది అభ్యర్థులు కూర్చునేలా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణకు అవసరమైన ఇన్విజిలేటర్లు, సూపరింటెండెంట్లు ఇతర సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, ఆర్డీవో రమేశ్ రాథోడ్, తదితరులు ఉన్నారు.