ఎదులాపురం, అక్టోబర్ 7 : టీఎస్పీఎస్సీ ద్వారా ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ -1 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. పలు పరీక్షా కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. స్థానిక విద్యార్థి జూనియర్, లిటిల్ స్టార్ హైస్కూ ల్, ఆర్యభట్టా స్కూల్ను ఆర్డీవో రాథోడ్ రమేశ్ తో కలిసి పరిశీలించారు. గ్రూప్-1 పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు సౌకర్యాలు కల్పించాలని, ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని యాజమాన్యాలను ఆదేశించారు.
కెమెరాల ఏర్పాటు అంశాన్ని డీఈవో, ఆర్డీవోలు పర్యవేక్షించాలని సూచించారు. గ్రూప్ -1 పరీక్షను 19 కేంద్రాల్లో 6200 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. డీఈవో ప్రణీత, కలెక్టరేట్ పర్యవేక్షకురాలు వర్ణ, ఆయా పాఠశాల, కళాశాలల యాజమాన్యం పాల్గొన్నారు.