నస్పూర్, ఫిబ్రవరి 15: ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
నస్పూర్లోని కలెక్టరేట్లో బదిలీల్లో భాగంగా జిల్లాలో గురువారం బాధ్యతలు స్వీకరించిన పలువురు అధికారులు,ఉద్యోగులు మర్యాద పూర్వకంగా కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జవాబుదారీతనంతో వ్యవహరించి, ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు.