ఆసిఫాబాద్ : దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన రుణాల చెక్కులను ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దళితులు వ్యాపార రంగంలోనూ రాణించాలన్నారు. వ్యాపారం ద్వారా ఆర్థికాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పథకాలను ప్రవేశ పెడుతున్నారని వెల్లడించారు.
ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు, ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ అలీబీన్హైమద్, జైనూర్ ఏఎంసీ చైర్మన్ భగవంత్రావు, ఎఎంసీ మాజీ చైర్మన్ గంధం శ్రీనివాస్, ఎస్పీ కార్పొరేషన్ జిల్లా అధికారి సంజీవన్, ఎంపీడీవో శశికళ తదితరులున్నారు.