తాండూర్ : పీఎం అజయ్ ప్రాజెక్టు ప్రయోజనాలు అందరికీ అందేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ పీ చంద్రయ్య ( Chandraiah ) అధికారులకు సూచించారు. పీఎం అజయ్( PM Ajay ) కి ఎంపికైన మండలంలోని చౌటపల్లి గ్రామపంచాయతీని మంగళవారం బెల్లంపల్లి డివిజనల్ పంచాయతీ అధికారి కె సతీష్ కుమార్ తో కలిసి సందర్శించారు.
గ్రామంలో చేపడుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకుని పనులు సక్రమంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పనుల ప్రయోజనాలను ప్రజాప్రతినిధులకు, పంచాయతీ కార్యదర్శులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం పారిశుధ్య కార్యక్రమాలు, డ్రైన్స్ పరిశీలించారు.
వేసవిలో నీటి సరఫరాలో ఎలంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. నర్సరీ, వైకుంఠ ధామం, సిగ్రిగేషన్ షెడ్లను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. ఇక్కడ ఎంపీడీవో పీ శ్రీనివాస్; ఎంపీవో అనిల్ కుమార్, సర్పంచ్ ముదాం సునీత, కార్యదర్శి వసంత, సిబ్బంది ఉన్నారు.