నెన్నెల, ఏప్రిల్ 3: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని గొల్లపల్లి గ్రామం జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నది. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అందించే దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారానికి ఇటీవల ఎంపికైంది. 9 అంశాల్లో గ్రామం వంద శాతం స్కోరింగ్ సాధించడంతో, అధికారులు ఈ అవార్డుకు ఎంపిక చేశారు. సర్పంచ్ ఇందూరి శశికళ, గ్రామ కార్యదర్శి రంజిత్ సమన్వయంతో ముందుకెళ్తూ పల్లెను ప్రగతి పథంలో నిలుపుతున్నారు. జిల్లా స్థాయిలో రెండుసార్లు ఉత్తమ సర్పంచ్గా శశికళ ఎంపికవడమే ఆమె పనితీరుకు అద్దం పడుతున్నది. అభివృద్ధి, సామాజిక భద్రతా విషయంలో గ్రామాన్ని ముందంజలో నిలిపారు. జాతీయ స్థాయికి రాష్ట్రం నుంచి వెళ్లిన 27 నామినేషన్లలో గొల్లపల్లి ఒకటి.
పల్లె ప్రగతి గ్రామంలో ఎంతో మార్పు తెచ్చింది. రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. డ్రైనేజీ సమస్య పరిష్కారమైంది. శ్మశాన వాటిక అందుబాటులోకి వచ్చింది. శ్మశాన వాటిక వరకు పక్కా రోడ్డు నిర్మించారు. ఇంటింటా మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు వందశాతం పూర్తయ్యాయి. దీంతో ఉత్తమ మహిళా సర్పంచ్గా కలెక్టర్ చేతులమీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. వార్డుల్లో పారిశుధ్యలోపం లేకుండా చూస్తున్నారు. ఇరుకుగా ఉన్న రోడ్లను వెడల్పు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. వార్డుల్లో వంగిపోయి, విరిగిపోయి ఉన్న విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు. వాటికి విద్యుద్దీపాలు అమర్చారు. హరిత హారంలో భాగంగా ఇంటింటికీ మొక్కలు అందించారు. రోడ్ల వెంట, పాఠశాలలో మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. వాటికి ప్రతి వారం నీటిని అందిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించారు. ఈజీఎస్ ద్వారా నర్సరీ ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన మొక్కలను పెంచుతున్నారు. 2015లోనూ గొల్లపల్లి జాతీయ స్థాయి అవార్డును అందుకుంది. అప్పటి సర్పంచ్ గడ్డం తిరుపతి గౌడ్ గ్రామంలో మరుగు దొడ్ల నిర్మాణం వేగంగా చేపట్టారు. దీంతో అప్పుడు ఉత్తమ పంచాయతీ అవార్డును కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ అందజేసింది.
గొల్లపల్లి గ్రామంలో 9 అంశాల్లో వంద శాతం ఫలితాలు సాధించడంతో, జాతీయ స్థాయి అవార్డుకు నామినేట్ అయ్యింది. గ్రామంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1406 మంది ఉన్నారు. 435 గృహాలు ఉ న్నాయి. 205 మంది 100 శాతం సామాజిక సహాయ ప్రయోజనాలను పొందుతున్నారు. 87 మంది వృద్ధులు, 85 మంది వితంతువులు, 22 మంది దివ్యాంగులు, ఆరుగురు గీత కార్మికులు, ఐదుగురు ఒంట రి స్త్రీలు పింఛన్లు పొందుతున్నారు. గ్రామ పంచాయతీలోని దాతలు నగదు, కిరాణా సామగ్రి, చక్రాల కుర్చీలు, స్పోర్ట్స్ కిట్లు విరాళంగా అందిస్తూ తమ ఊదారతను చాటుకుంటున్నారు. 11 మంది దివ్యాంగులకు వివిధ రకాల సహాయ పరికరాలను అందించారు. ప్రత్యేక దివ్యాంగుల సర్టిఫికెట్ను అందించారు. 431 మంది కి ఆరోగ్య పథకం కింద కార్డులు పంపిణీ చేశారు. గ్రా మంలో ఉన్న రెండు అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలలో అనుసంధా నం చేసి అంగన్వాడీ పిల్లలకు ప్రీ స్కూల్ విద్యను అందిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, ఐదేండ్ల లోపు పిల్లలు 95 మందికి ఐసీడీఎస్ ద్వారా పౌష్ఠికాహారం అందిస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాలను ఏ ర్పాటు చేయించి, వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. సర్పంచ్ శశికళ గ్రామంలోని ప్రభు త్వ పాఠశాలలో అప్పుడప్పుడు టీచర్గా బోధననందిస్తున్నారు. ఎంఎస్సీ బీఈడీ చదివిన ఆమె, విద్యార్థులకు అవసరమైన సలహాలు , సూచనలు అందిస్తున్నది.
గ్రామంలో సామాజిక భద్రతా పరంగా అందిరి సహాయం తీసుకుంటున్నాం. ప్రజలంతా సహకరిస్తున్నారు. సంక్షేమ పథకాలను సకాలంలో అర్హులందరికీ అందేలా చూస్తున్నాం. జిల్లా ,రా్రష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు మరింత ప్రోత్సాహాన్నిస్తుంది. మాపై మరింత బాధ్యత పెంచుతుంది.
-రంజిత్ (కార్యదర్శి)
టీచర్ కావాలనే లక్ష్యం నెరవేరకున్నా, ప్రజలకు మంచి చేసే అవకాశం లభించింది. గ్రామాభివృద్ధే ధ్యేయంగా వివిధ పనులు చేపడుతున్నాం. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సహకారంతో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం. గ్రామంలో ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మాణం పూర్తి చేశాం. గ్రామ ప్రగతిలో ప్రజల భాగస్వామం ఎంతో ఉంది. వారి సహకారంతోనే ఈ అవార్డులు సాధిస్తున్నాం. మరింత ఉత్సాహంతో మేం పని చేసేందుకు ఈ పురస్కారాలు తోడ్పడుతాయి.
-ఇందూరి శశికళ, సర్పంచ్