హాజీపూర్ : వినాయక చవితి (Ganesh Utsavs ) ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగాకుండా శాంతియుత ( Peaceful ) వాతావరణంలో జరుపుకొని ఆదర్శంగా ఉండాలని హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే ( Tahasildar Deshpande ) , మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్ ( CI Akula Ashok ) కోరారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో గణేశ్ మండలి నిర్వాహకులతో గురువారం పోలీసులు శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసుల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. నిమజ్జనం రోజు పోలీసులకు సహకరించాలన్నారు. పరిమితికి మించి డీజే సౌండ్లను పెట్టుకోవద్దని, ఎలాంటి గొడవలకు తావులేకుండా శోభయాత్ర ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. మండపాల వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా తగిన జాగ్రత్త తీసుకోవాలని కోరారు.
మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, శానిటేషన్ పనులు నిరంతరం కొనసాగాలని సూచించారు. కేబుల్ వైర్లు, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. సూచించిన ప్రదేశాల్లో నిమజ్జనం చేయాలని తెలిపారు. ముల్కల్ల పుష్కర ఘాట్ తో పాటు , గుడిపేట్ ఎల్లంపల్లి బ్యాక్ వాటర్లో నిమజ్జనం చేయరాదని అన్నారు.
సీఐ ఆకుల అశోక్ మాట్లాడుతూ గణేశ్ మండపాల ఏర్పాటు, నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. గణేష్ మండపాల వద్ద మద్యం తాగడం, పేకాట ఆడటం, అసభ్యకర నృత్యాలు చేయడం, అన్యమతస్తులను కించపరిచే ప్రసంగాలు చేయడం, పాటలు పాడడటం నిషేధమన్నారు. ఈ కార్యక్రమంలో హాజీపూర్ ఎస్సై స్వరూప్ రాజ్ , ఏఎస్సై చాంద్ పాషా, పోలీస్ సిబ్బంది, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.