కాసిపేట, మార్చి 9 : కాసిపేట మండలంలోని దేవాపూర్కు చెందిన గడ్డం మేఘన మొదటి ప్రయత్నంలోనే రెండు రాష్ర్టాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన సందర్భంగా ఘనంగా సన్మానించారు.
హైదరాబాద్ ఉస్మానియా విశ్వ విద్యాలయం న్యాయ కళాశాల ఆధ్వర్యంలో డీయూసీఐఎంయూసీ-2024 లిటరసీ అండ్ కల్చరల్ ఫెస్టివల్లో గడ్డం మేఘనను తెలంగాణ హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ యాదవ్, సీనియర్ ప్రొఫెసర్ జబీ రెడ్డి, ప్రిన్సిపాల్ రాధిక యాదవ్, న్యాయ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.