నేరడిగొండ, మార్చి 22 : మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో సీసీరోడ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మండలంలో ప్రత్యేక అభివృద్ధి నిధులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన రోడ్లు శరవేగంగా సాగుతున్నాయి. సీసీ రోడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాల భవనాలు, ప్రహరీ, డ్రైనేజీలు నిర్మిస్తున్నారు. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో పనులు చకచకా సాగిపోతున్నాయి. దీంతో అంతర్గత రోడ్ల సమస్య పరిష్కారం కావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీకి సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 20లక్షల చొప్పున కేటాయింపు…
మండలంలోని 27 గ్రామాలకు గాను రూ.1.50 కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. గ్రామ పంచాయతీల వారీగా రూ.10 నుంచి 20 లక్షలు వెచ్చించింది. దీంతో ఆయా గ్రామాల్లో అంతర్గత రోడ్ల సమస్యలు తీరనున్నాయి. ఇందులో బొందిడి, బోరిగాం, బుగ్గారం(బీ), చించోలి, ధన్నూర్(డీ), ఇస్పూర్, కిష్టాపూర్, కొర్టికల్(బీ), కుంటాల(బీ), లఖంపూర్, మథురతండా, నాగమల్యాల్, పట్పడితండా, పీచర, రాజులతండా, రేంగన్వాడి, శంకరాపూర్, సావర్గాం, సుర్దాపూర్, అద్దాల తిమ్మాపూర్, సేవాదాస్నగర్, నారాయణపూర్, నేరడిగొండ, యాపల్గూడ, తర్నం గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.
చకచకా పనులు…
పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజాప్రతినిధులతో సమావేశమై ఏఏ పనులు చేపట్టాల్లో ప్రతిపాదనలు తయారు చేసి జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. ఇందుకోసం సర్పంచ్ల నుంచి ఎంపీడీవోల ద్వారా ప్రతిపాదనలు తీసుకున్నారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో రూ.20 లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. రోడ్ల పనులు మండలంలో చకచకా జరుగుతున్నాయి.