భీమారం, ఏప్రిల్ 1 : అంకూశపూర్ భూముల్లో రెవెన్యూ, అటవీశాఖ ఆధ్వర్యంలో జాయింట్ సర్వే నిర్వహిస్తామని మంచిర్యాల ఎఫ్ఆర్వో రత్నాకర్రావు అన్నారు. సోమవారం పోలంపల్లి గ్రామ పంచాయతీలోని అంకూశపూర్ శివారులో ఎస్ఐ రాములతో కలిసి అటవీ భూములకు హద్దులు ఏర్పాటు చేశారు. 30 ఏళ్లుగా సర్వే నంబర్ 140లో దాదాపు 100 ఎకరాల భూమి సాగు చేస్తున్నామని, అటవీశాఖ అధికారులు వచ్చి వేధింపులకు గురిచేస్తున్నారని స్థానిక రైతులు వారి దృష్టికి తీసుకొచ్చారు.
కేసీఆర్ సర్కారులో 10 ఏళ్లపాటు ఏ ఒక్క అటవీశాఖ అధికారి రాలేదని, ఇప్పుడు నిత్యం వస్తూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రత్నాకర్రావును వివరణ కోరగా.. నేరస్తులు చెబితే తామెలా పరిగణలోకి తీసుకుంటామన్నారు. రైతులు దుర్గం శివకుమార్, దుర్గం రాములు, కుమర శ్రీనివాస్, ఆకుదారి రాజం, దర్శనాల రమేశ్, కోట పోశం, దుర్గం మధూకర్ ఉన్నారు.