నిర్మల్, జనవరి 29(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాకు చెందిన రాజకీయ దిగ్గజం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల మంత్రి పొద్దుటూరి నర్సారెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉద యం హైదరాబాద్లో కన్ను మూశారు. సారంగాపూర్ మండలంలోని మలక్ చించోలి గ్రా మానికి చెందిన నర్సారెడ్డి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. అదే స్ఫూర్తితో కాం గ్రెస్ పార్టీలో చేరి చిన్న నాటి నుంచే రాజకీయ నేతగా ఎదిగారు. అంచెలంచెలుగా ఎదిగి పీసీసీగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఆ యన హయాంలోనే స్వర్ణ ప్రాజె క్టు నిర్మాణం జరిగింది. మాజీ మంత్రి అల్లో ల ఇంద్రకరణ్రెడ్డికి సన్నిహితంగా ఉండేవారు. రాజకీయ దురందరుడిగా పేరున్న నర్సారెడ్డి అందరితో సఖ్యతగా ఉంటూ పార్టీలకతీతంగా నేటి తరం రాజకీయ నాయకులకు సూచనలు, సలహాలు అందజేసేవారు. ఆరోగ్యం క్షీణించే వరకు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. కొంతకాలం నుంచి అనారోగ్యం కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. నర్సారెడ్డి మరణంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన పార్థివదేహాన్ని జూబ్లిహీల్స్లోని తన నివాసంలో అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం ఉంచారు. అక్కడికి వెళ్లి పలువురు నివాళులు అర్పించారు.
1931 సెప్టెంబర్ 22న నర్సారెడ్డి జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదివి బీఏ, ఎల్ఎల్బీ పట్టాలు పొందారు. న్యాయవాద వృత్తిలో కొనసాతూనే నిజాం నిరంకు శ పాలన నుంచి హైదరాబాద్ విముక్తి కోసం పోరాడారు. 1940 సంవత్సరం నుంచే క్రియాశీల రాజకీయాల్లో పాల్గొని మూడు సార్లు నిర్మల్ నియోజకవర్గ శాసనసభ్యునిగా, ఒకసారి ఎమ్మెల్సీగా, ఆదిలాబాద్ ఎంపీగా గెలుపొందారు. 1972-78 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రా ష్ట్ర కేబినెట్లో రెవెన్యూ, నీటి పారుదల శాఖ మం త్రిగా పనిచేశారు. 1962 -1978 వరకు వరుసగా నిర్మల్ ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్రస్థాయిలో అనేక పదవులను నిర్వహించారు. 1981-85 వరకు ఎమ్మెల్సీగా, 1989-91 వరకు ఆదిలాబాద్ ఎంపీగా ఉన్నారు.