సీసీసీ నస్పూర్, మార్చి 2: మహిళలు సమాజ మార్గదర్శకులుగా నిలుస్తున్నారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. శనివారం సీసీసీ నస్పూర్లోని విద్యానగర్ క్రిష్ణవేణి హైస్కూల్లో కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ బత్తిని దేవన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ముందస్తు ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలకు హాజరై మాట్లాడారు. మహిళల్లో పట్టుదల ఎక్కువగా ఉంటుందని, మారుతున్న కాలానికనుగుణంగా వారిలో చైతన్యం వస్తుందన్నారు.
సామాజిక సేవా, రాజకీయాలు, విద్య, ఉద్యోగ రంగాల్లో రాణిస్తూ ప్రశంసలు పొందుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో పోచయ్య, కౌన్సిలర్లు వంగ తిరుపతి, కుర్మిల్ల అన్నపూర్ణ, ట్రస్మా రాష్ట్ర కార్యదర్శి మల్లెత్తుల రాజేంద్రపాణి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేగళ్ల ఉపేందర్, నస్పూర్ మండల ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షుడు మైదం రామకృష్ణ, ఆయా పాఠశాలల కరస్పాండెంట్లు విష్ణు, రాజ్కుమార్ పాల్గొన్నారు.