దహెగాం, డిసెంబర్ 25 : ప్రజాసేవే లక్ష్యంగా ముందు కు సాగుతామని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. సోమవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ఓడినా.. గెలిచినా ప్రజలకు సేవ చేస్తామన్నారు.
కార్యకర్తలెవ్వరూ అధైర్యపడవద్దని, అందరికీ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాళ్లపల్లి శ్రీరామారవు, రైతుబంధు మండల కన్వీనర్ కంభగౌని సంతోష్గౌడ్, సర్పంచ్లు బండ కృష్ణయూర్తి, పార్టీ మండల అధ్యక్షుడు ప్రసాద్రాజ్ పాల్గొన్నారు.