రామకృష్ణాపూర్, మే 5 : క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 8వ వార్డు గద్దెరాగడిలో గ్రామ దేవత పోచమ్మ తల్లి ఎదురుకొలుపు పూజా కార్యక్రమాన్ని పురసరించుకొని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల సుమన్ ఆదివారం దర్శించుకున్నారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పోచమ్మ ఆశీస్సులతో వార్డు ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు రాజారమేశ్, కౌన్సిలర్లు ఆలుగుల శ్రీలత సత్తయ్య, వార్డు ప్రజలు పాల్గొన్నారు.